Don't Miss!
- News జగన్ సంచలనం..వైఎస్ భారతికి కీలక బాధ్యతలు
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Sports SRH vs RCB: అందుకే వాషింగ్టన్ సుందర్పై వేటు వేసాం: ప్యాట్ కమిన్స్
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
గ్రాండ్గా ‘కొత్త జంట’ ఆడియో, భారీగా మెగా ఫ్యాన్స్!
హైదరాబాద్: మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కుమారుడు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సోదరుడు శిరీష్, రెజినాలు జంటగా హ్యాట్రిక దర్శకుడు మారుతి దర్శకత్వంలో గీతాఆర్ట్స్ బ్యానర్లో నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో ప్రొడ్యూసర్ బన్నీ వాసు నిర్మిస్తున్న చిత్రం కొత్త జంట. ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ప్రస్తుతం శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. ఏప్రిల్ 5న ఆడియో విడుదల చేసి సమ్మర్ కానుకగా మే మొదటి వారంలో చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా నిర్మాత బన్నీ వాసు మాట్లాడుతూ 'షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. వేగంగా పోస్టు ప్రొడక్షన్ పనులు పూర్తి చేస్తున్నాము. జేబీ మంచి సంగీతం అందించారు. ఏప్రిల్ 5న సినీ ప్రముఖుల, మెగా అభిమానుల సమక్షంలో అత్యంత భారీగా ఆడియో ఆవిష్కరించబోతున్నాం. చిరంజీవి నటించిన 'ఖైదీ నెం. 786' చిత్రంలోని 'అటు అమలాపురం...ఇటు పెద్దాపురం' సాంగ్ రీమిక్స్ చేసారు. ఈ చిత్రానికి ఈ సాంగు హైలెట్గా నిలవనుంది. మారుతి ఈ చిత్రాన్ని క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టెనర్గా తెరకెక్కించారు. మారుతి దర్శకత్వంలో ఇప్పటి వరకు వచ్చిన చిత్రాలకు భిన్నంగా ఈ చిత్రం ఉంటుంది. ఇద్దరు స్వార్థ పరుల మధ్య జరిగే చక్కని ప్రేమకథ తీసుకుని రెండు గంటల ఎంటర్టెన్ చేసాడు. ప్రతి ఒక్కరూ తమని తాము ఈ చిత్రంలో చూసుకునేలా సాధారణ మనుషుల్లోంచి పాత్రలు తెరకెక్కించాడు. పోసాని కృష్ణ మురళి నటన మా చిత్రానికి మరో హైలెట్గా నిలుస్తుంది. ఆద్యంతం నవ్వులు కురిపించే పాత్రని చేసారు' అన్నారు.
దర్శకుడు మారుతి మాట్లాడుతూ...'శిరీష్ బాడీ లాంగ్వేజ్ కి సరిపోయే కథ. పక్కా ఫ్యామిలీ ఎంటర్టెనర్. లవ్, ఎమోషన్, కామెడీ కలగలిపిన ఫ్యామిలీ ఎంటర్టెనర్ అని ధైర్యంగా చెబుతున్నాను. శిరీష్, రెజీనా మధ్య వచ్చే సీన్స్ అందరికీ ఆకట్టుకుంటాయి. నా గత చిత్రం ప్రేమ కథా చిత్రమ్ కంటే రెండింతలు కామెడీ ఉంటుంది. మే మొదటి వారంలో సినిమాను విడుదల చేయడానకి సన్నాహాలు చేస్తున్నాం' అన్నారు.
నటీనటుల: అల్లు శిరీష్, రెజీనా, మధురిమ, పోసాని కృష్ణ మురళి, ఆహుతి ప్రసాద్, రావు రమేష్, రోహిణి, సప్తగిరి, ప్రవీణ్, జోష్ రవి, మధు, సాయి పంపనా, ఏలూరు శీను తదితరులు. సంగీతం: జేబి, ఎడిటింగ్: ఉద్ధవ్, ఆర్ట్: రమణ, యాక్షన్: విజయ్, డాన్స్: గణేష్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్.కె.ఎన్, పి.ఆర్.ఓ: ఏలూరు శ్రీను, సమర్పణ: అల్లు అరవింద్, సినిమాటోగ్రఫీ: రిచర్డ్ ప్రసాద్, నిర్మాత్: బన్నీ వాసు, కథ-మాటలు-స్ర్కీన్ ప్లే- దర్శకత్వం: మారుతి.