Don't Miss!
- News కాంగ్రెస్ ఖమ్మం సీటు పంచాయితీలో అనూహ్య మలుపు..!!
- Technology జియో సినిమా యాప్లో IPL మ్యాచ్లను ఉచితంగా చూస్తున్నారా.. రేపు కీలక ప్రకటన??
- Sports ఆ రూల్ వల్లే గెలిచాం- KL రాహుల్
- Automobiles క్రాష్ టెస్ట్లో హోండా అమేజ్కు గట్టి షాక్.. ఆ విభాగంలో ‘0' రేటింగ్.!!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
Gopichand Malineni 'క్రాక్' రెమ్యునరేషన్ గొడవ.. మొదటిసారి స్పందించిన నిర్మాత
మాస్ మహారాజా రవితేజ నటించిన క్రాక్ సినిమా సంక్రాంతి విన్నర్ గా నిలిచిన విషయం తెలిసిందే. చాలా కాలం తరువాత రవితేజతో పాటు చిత్ర దర్శకుడు గోపిచంద్ మలినేని అసలైన బాక్సాఫీస్ హిట్ కొట్టేశాడు. రాజా ది గ్రేట్ సినిమా అనంతరం బ్యాక్ తో బ్యాక్ డిజాస్టర్స్ వల్ల సతమతమతమైన రవితేజకు క్రాక్ సినిమా ఒక్కసారిగా పవర్ఫుల్ బూస్ట్ ఇచ్చింది. ఇక దర్శకుడి కెరీర్ కు కూడా మంచి బూస్ట్ ఇచ్చింది. అయితే సినిమాకు సంబంధించిన రెమ్యునరేషన్ గొడవ అందరిని ఆశ్చర్యానికి గురి చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ విషయంపై నిర్మాత ఠాగూర్ మధు మొదటిసారి స్పందించారు.
శ్వేతవర్ణపు దుస్తుల్లో చాందినీలా రకుల్ ప్రీత్ సింగ్.. ముంబై వీధుల్లో హంగామా
క్రాక్ అందించిన భారీ లాభాలు
బాక్సాఫీస్ వద్ద రవితేజకు హిట్టు పడి చాలా కాలమవుతోంది. ఇక క్రాక్ సినిమా కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ ను అందించింది. పాజిటివ్ టాక్ వచ్చినప్పటి నుంచి కూడా సినిమా బాక్సాఫీస్ వద్ద స్పీడ్ మరింత పెంచింది. పెట్టిన పెట్టుబడిని చాలా తొందరగా వెనక్కి తెచ్చిన క్రాక్ కు ఇప్పటివరకు 20కోట్లకు పైగా లాభాలు వచ్చాయి. ఇక గ్రాస్ అయితే 50కోట్లు దాటేసింది.
రెమ్యునరేషన్ గొడవ
అయితే 20కోట్లకు పైగా ప్రాఫిట్స్ అందించిన దర్శకుడు గోపీచంద్ మలినేనికి రెమ్యునరేషన్ కూడా సరిగ్గా అందకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల గోపిచంద్ తనకు ఇంకా రావాల్సిన 12లక్షల రూపాయలు రెమ్యునరేషన్ రాలేదని నిర్మాత ఏ విధంగాను జవాబు ఇవ్వడం లేదని డైరెక్టర్స్ అసోసియేషన్ ను సంప్రదించాడు.
మొదటిసారి స్పందించిన నిర్మాత
ఇక ఆ తరువాత నిర్మతల మండలి వరకు గొడవ వెళ్లింది. ఈ వివాదంపై ఒక స్పెషల్ కమిటీని కూడా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తారట. ఇప్పటికే చిత్ర నిర్మాత ఠాగూర్ మధుతో చర్చలు జరిపారు. ఇక ఈ విషయంపై ఆయన మొదటిసారి నోరు విప్పారు.
మిస్ కమ్యూనికేషన్ కారణంగానే..
ఠాగూర్ మధు మాట్లాడుతూ.. నిజానిజాలు తెలుసుకుని సమస్యను పరిష్కరించడానికి కమిటీ సభ్యులు ప్రయత్నాలు చేస్తున్నారు. కేవలం మిస్ కమ్యూనికేషన్ కారణంగానే ఈ సమస్య ఏర్పడింది. కోవిడ్ కష్టకాలంలో చాలా కష్టపడి సినిమాను పూర్తి చేశాం. క్లిష్టమైన పరిస్థితుల్లో బడ్జెట్ ఎంత పెరిగినా కూడా వెనుకడుగు వేయలేదు. వీలైనంత త్వరగా కమిటీ సభ్యులతో కలిసి సమస్యలను పరిష్కరించుకుంటాం. కొన్ని కారణాలతో వివాదంపై ఇప్పుడే పూర్తిగా మాట్లాడలేను త్వరలోనే వివరించే ప్రయత్నం చేస్తాను.. అని వివరణ ఇచ్చారు.