'కృష్ణం వందే జగద్గురుమ్' కథ ఏమిటంటే...
హైదరాబాద్ : దగ్గుబాటి రానా,నయనతార కాంబినేషన్ లో క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'కృష్ణం వందే జగద్గురుమ్'. ఈ చిత్రం నవంబర్ మొదటి వారంలో రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రం కథ గురించి క్రిష్ మాట్లాడుతూ...గనుల్ని కొల్లగొట్టి వ్యాపారం చేస్తూ భూమాతకు గర్భశోకం కలిగిస్తున్న అభినవ భూభకాసురుల్ని అంతమొందించే అభినవ కృష్ణుడు కథే 'కృష్ణం వందే జగద్గురుం'. తప్పకుండా చిత్రం అందరికి సరికొత్త అనుభూతిని కలిగిస్తుంది అన్నారు.
అలాగే ... రోమ్లో ఉన్నప్పుడు రోమన్లా బతకాల్సిందే అంటాడు బీటెక్ బాబు. పుస్తకాల కంటే లోకాన్నే అతను ఎక్కువగా చదివాడు. ఈ సంఘంలో బతకాలంటే 'చిన్ని నా బొజ్జకు శ్రీరామరక్ష' అనుకోవడంలో తప్పులేదని వాదిస్తాడు. అలా ఉండటాన్ని స్వార్థం అనడంలో అర్థం లేదన్నది అతని వాదన. అయితే బాబు ఆలోచనలు దేవికతో పరిచయం తరవాత మారాయి. అదెలాగో మా చిత్రంలో చూడాల్సిందే అన్నారు క్రిష్.అలాగే..ఈ చిత్రం లాండ్ మాపియా నేఫధ్యంలో వాస్తవ సంఘటనలు ఇన్ కార్పోరేట్ చేస్తూ జరుగుతుంది.తమిళ నాడు,కర్ణాటక బోర్డర్ లో కథ జరుగుతుంది అన్నారు.
ఇక ఈ సినిమాతో నేను ఓ కొత్త జనర్ ని ట్రై చేస్తున్నాను. ఈ చిత్రం ట్రావిల్ ఎడ్వెంచర్ ఫిల్మ్. ఇందులో రానా ధియోటర్ ఆర్టిస్టుగా,స్వార్ద పరుడుగా కనపిస్తే...నయనతార డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ గా స్వార్దం లేని వ్యక్తిత్వంతో కనిపిస్తుంది అన్నారు. ఈ చిత్రంలో రానా క్యారెక్టర్ డిఫరెంట్ గా ఉంటుందంటున్నారు దర్సకుడు క్రిష్. ఆయన ఈ విషయమై మాట్లాడుతూ...''మనిషి డబ్బుతో పాటు నడుస్తున్నాడో, డబ్బే మనిషిని నడిపిస్తుందో అర్థంకాని పరిస్థితుల్లో ఉన్నాం. మా బీటెక్ బాబు ఎలా నడిచాడన్నది సస్పెన్స్. నొప్పింపక, తానొవ్వక నెగ్గుకొస్తుంటాడు. కథకీ, కృష్ణ తత్వానికీ ఉన్న సంబంధం ఆసక్తికరం'' అన్నారు.
ఈ చిత్రంలో రానా పేరు బాబు. చదివింది బీటెక్. అందుకే అన్నీ హైటెక్ తెలివి తేటలు. పుస్తకాల్లో చదివిన జ్ఞానం కంటే... జీవితాల్లోంచి గ్రహించిందే ఎక్కువ. ఎప్పటికయ్యది ప్రస్తుతం అప్పటికామాటలాడి... తప్పించుకొన్న శ్రీకృష్ణతత్వం బాగా అలవాటు చేసుకొన్నాడు. అదే అనుసరించాడు. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్ గా రానా సరసన చేస్తోంది. నయనతార పాత్ర పేరు దేవిక. ఆమె డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్. ఈ పాత్ర చిత్రంలో కీలకమై నడుస్తుంది. ఛాయాగ్రహణం: జ్ఞానశేఖర్, సంగీతం: మణిశర్మ.


Click it and Unblock the Notifications











