Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
పూర్వ జన్మ సుకృతం.. కాకతాళీయంగా జరిగిపోయింది.. బాలకృష్ణ
ప్రపంచపటంపై తెలుగు జాతికి గుర్తింపు తెచ్చిన మహా వ్యక్తి నందమూరి తారక రామారావు జీవిత కథ ఆధారంగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్ జోష్గా కొనసాగుతున్నది. చిత్ర నిర్మాణంలో భాగంగా నందమూరి బాలకృష్ణ శనివారం దర్శకుడు క్రిష్తో కలిసి ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరులో పర్యటించారు. ఎన్టీఆర్, బసవతారకం విగ్రహాలకు పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మీడియాతో మాట్లాడారు.
ఎన్టీఆర్ గొప్ప నేత, మహనీయుడు. అలాంటి వ్యక్తి కథను భావితరాలకు తెలియజెప్పాలనే ఉద్దేశంతో ఎన్టీఆర్ బయోపిక్ను తీస్తున్నాను. అందుకు క్రిష్ నాకు జత కలిశారు. గౌతమిపుత్ర శాతకర్ణి తర్వాత ఇది నాకు రెండో సినిమా అని బాలకృష్ణ అన్నారు.
ఎన్టీఆర్ బయోపిక్ నిర్మాతగా నాకు మొదటి సినిమా. అదీ నా బ్యానర్లోనే తీయడం మరో విశేషం. ఈ రెండు కాకతాళీయంగా జరిగిపోయాయి. పుట్టిన ఊరికి, జాతికి, దేశానికి ఖ్యాతి తెచ్చిన వారిలో ఎన్టీఆర్ ఒకరు. అలాంటి మహనీయుడి పాత్రలో నేను నటించడం పూర్వజన్మ సుకృతం కావొచ్చు అని బాలయ్య పేర్కొన్నారు.
ఎన్టీఆర్ బయోపిక్ నిర్మాణ షెడ్యూల్లో భాగంగానే నిమ్మకూరుకు వచ్చాం. ఈ ఊర్లో బంధువులకు క్రిష్ను పరిచయం చేశాను. నిమ్మకూరులో అక్టోబర్ చివరి వారంలో గానీ, నవంబర్లో గానీ ఎన్టీఆర్ బయోపిక్ సినిమా షూటింగ్ ఉంటుంది అని బాలకృష్ణ స్పష్టం చేశారు.