Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
అల్లు అర్జున్, మనోజ్ లలో ఎవరు ఎక్కువ?
ఏ ఒక్కరి పాత్ర కూడా తక్కువ, ఎక్కువా అనే తేడా లేదు. అన్ని పాత్రలూ ఎంతో ఎమోషన్ తో నడుస్తాయి. ప్రతి పాత్రికి కీరవాణి అందించిన రీరికార్డింగ్ హార్ట్ టచ్చింగ్ తో సాగుతుంది అంటూ క్రిష్ తన లేటెస్ట్ 'వేదం" లో పాత్రల నిడివి గురించి చెప్పుకొచ్చారు. గత కొద్ది రోజులుగా వేదం చిత్రంలో అల్లుఅర్జున్ కి ప్రయారిటీ ఇచ్చి మనోజ్ పాత్ర తక్కువ చేసారంటూ వస్తున్న వార్తలుకు ఆయన ఈ విధంగా సమాధానమిచ్చినట్లయింది. ఇక టైటిల్ 'వేదం" గురించి క్రిష్ చెబుతూ...'వేదం" అంటే జ్ఞానం. మనిషి తనలోని మనిషిని తెలుసుకోవడమే జ్ఞానం..అదే ఈ చిత్రం. వాస్తవానికి వేదానికి నాలుగంటారు. కాని వేదం ఒకటే. మనిషి తన సౌలభ్యం కోసం నాలుగుగా మార్చుకున్నాడు.
అలాగే నేను వేదాన్ని ఐదు పాత్రలకు అనుకున్నాను అన్నారు. అల్లు అర్జున్, మనోజ్, అనుష్క, మనోజ్ బాజ్పాయ్, దీక్షితా సేత్ ప్రధాన పాత్రధారులుగా ఆర్కా మీడియా పతాకంపై జాగర్లమూడి రాధాకృష్ణ (క్రిష్) దర్శకత్వంలో ప్రసాద్ దేవినేని, శోభు యార్లగడ్డ సంయుక్తంగా నిర్మించిన 'వేదం" చిత్రం జూన్ 3న విడుదలకానుంది. కీరవాణి మొదటిసారి నాలుగు పాటలు ఈ చిత్రంకోసం రాశారు. ఎడిటింగ్: శ్రవణ్ కె., యాక్షన్: రామ్లక్ష్మణ్, ఆర్ట్: రాజీవ్ నాయర్, కెమెరా: గణశేఖర్ వి.ఎస్., సంగీతం: ఎంఎం కీరవాణి. నిర్మాతలు: ప్రసాద్ దేవినేని, శోభు యార్లగడ్డ, కథ, మాటలు స్క్రీన్ప్లే దర్శకత్వం: క్రిష్.