Don't Miss!
- News మీనరాశిలో బుధుడు ప్రత్యక్షం: ఈ రాశులవారి కెరీర్ ప్రమాదంలో.. జాగ్రత్త!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
అల్లు అర్జున్, మనోజ్ లలో ఎవరు ఎక్కువ?
ఏ ఒక్కరి పాత్ర కూడా తక్కువ, ఎక్కువా అనే తేడా లేదు. అన్ని పాత్రలూ ఎంతో ఎమోషన్ తో నడుస్తాయి. ప్రతి పాత్రికి కీరవాణి అందించిన రీరికార్డింగ్ హార్ట్ టచ్చింగ్ తో సాగుతుంది అంటూ క్రిష్ తన లేటెస్ట్ 'వేదం" లో పాత్రల నిడివి గురించి చెప్పుకొచ్చారు. గత కొద్ది రోజులుగా వేదం చిత్రంలో అల్లుఅర్జున్ కి ప్రయారిటీ ఇచ్చి మనోజ్ పాత్ర తక్కువ చేసారంటూ వస్తున్న వార్తలుకు ఆయన ఈ విధంగా సమాధానమిచ్చినట్లయింది. ఇక టైటిల్ 'వేదం" గురించి క్రిష్ చెబుతూ...'వేదం" అంటే జ్ఞానం. మనిషి తనలోని మనిషిని తెలుసుకోవడమే జ్ఞానం..అదే ఈ చిత్రం. వాస్తవానికి వేదానికి నాలుగంటారు. కాని వేదం ఒకటే. మనిషి తన సౌలభ్యం కోసం నాలుగుగా మార్చుకున్నాడు.
అలాగే నేను వేదాన్ని ఐదు పాత్రలకు అనుకున్నాను అన్నారు. అల్లు అర్జున్, మనోజ్, అనుష్క, మనోజ్ బాజ్పాయ్, దీక్షితా సేత్ ప్రధాన పాత్రధారులుగా ఆర్కా మీడియా పతాకంపై జాగర్లమూడి రాధాకృష్ణ (క్రిష్) దర్శకత్వంలో ప్రసాద్ దేవినేని, శోభు యార్లగడ్డ సంయుక్తంగా నిర్మించిన 'వేదం" చిత్రం జూన్ 3న విడుదలకానుంది. కీరవాణి మొదటిసారి నాలుగు పాటలు ఈ చిత్రంకోసం రాశారు. ఎడిటింగ్: శ్రవణ్ కె., యాక్షన్: రామ్లక్ష్మణ్, ఆర్ట్: రాజీవ్ నాయర్, కెమెరా: గణశేఖర్ వి.ఎస్., సంగీతం: ఎంఎం కీరవాణి. నిర్మాతలు: ప్రసాద్ దేవినేని, శోభు యార్లగడ్డ, కథ, మాటలు స్క్రీన్ప్లే దర్శకత్వం: క్రిష్.