Don't Miss!
- Technology యూట్యూబ్కు పోటీగా TV యాప్.. ఫీచర్లు, అల్గారిథమ్ పైన X సీఈవో ఏమన్నారంటే.. ?
- News బీఆర్ఎస్కు బిగ్ షాక్.. కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్న వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి
- Sports SRHకు భయపడి CSK సంచలన నిర్ణయం: ధోనీ మైండ్ గేమ్?
- Finance Stock Market Close: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- Lifestyle హడలెత్తిస్తున్న Bird Flu పాలు,గుడ్లు మరియు చికెన్ తినడం సురక్షితమేనా?మనుషులకూ వ్యాపిస్తుందా..నిపుణులు ఏమంటారు?
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
క్రిష్ సినిమా 'వేదం' స్పెషాలిటీ అదే...
తొలి చిత్రం గమ్యం తోనే నంది అవార్డుని,ప్రేక్షకుల రివార్డుని సొంతం చేసుకున్న క్రిష్(రాధాకృష్ణ జాగర్లమూడి)రెండో చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. వేదం టైటిల్ తో నిర్మితమవుతున్న ఈ చిత్రంలో మల్టిఫుల్ నేరేషన్ స్టైల్ లో కథనం చెప్పనున్నారని తెలుస్తోంది. అంటే ప్రధాన పాత్రలందరూ ఒకరికొకరు సంభందం లేకుండా ఉంటారు. ఎవరి కథ వారిదే. అయితే అందరికీ ఒకటే క్లైమాక్స్ ఉంటుంది. ఈ తరహా కథలు గతంలో హాలీవుడ్ లోనూ, హిందీలోనూ వచ్చాయి. తెలుగు తెరకు మాత్రం కొత్తే. ఈ ప్రయోగం విజయవంత అవుతుందని అంటున్నారు.
ఇక ఈ చిత్రంలో అల్లు అర్జున్, మనోజ్, అనుష్క, మనోజ్ బాజ్పాయ్ ప్రధాన పాత్రలు చేస్తున్నారు. అల్లు అర్జున్..మాస్ కి ప్రతినిధిగా కనపడితే, మనోజ్..రాక్ స్టార్ గా కనువిందు చేయనున్నాడు. ఇక అనూష్క వేశ్యగా కనపడి కథకు కిక్కు ఇవ్వబోతోంది. అర్క మీడియా సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న ఈ చిత్రం జనవరిలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు రానుంది. సంక్రాంతి రిలీజ్ డేట్ చెయ్యాలని నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు.ఇక ఈ చిత్రం చివరి షెడ్యూల్ షూటింగ్ త్వరలో మొదలవుతుంది. ఈ సినిమాకి కీరవాణి సంగీత దర్శకుడు.త్వరలో ఆడియో సైతం రిలీజ్ కానుంది.