క్రిష్ సినిమా 'వేదం' స్పెషాలిటీ అదే...
తొలి చిత్రం గమ్యం తోనే నంది అవార్డుని,ప్రేక్షకుల రివార్డుని సొంతం చేసుకున్న క్రిష్(రాధాకృష్ణ జాగర్లమూడి)రెండో చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. వేదం టైటిల్ తో నిర్మితమవుతున్న ఈ చిత్రంలో మల్టిఫుల్ నేరేషన్ స్టైల్ లో కథనం చెప్పనున్నారని తెలుస్తోంది. అంటే ప్రధాన పాత్రలందరూ ఒకరికొకరు సంభందం లేకుండా ఉంటారు. ఎవరి కథ వారిదే. అయితే అందరికీ ఒకటే క్లైమాక్స్ ఉంటుంది. ఈ తరహా కథలు గతంలో హాలీవుడ్ లోనూ, హిందీలోనూ వచ్చాయి. తెలుగు తెరకు మాత్రం కొత్తే. ఈ ప్రయోగం విజయవంత అవుతుందని అంటున్నారు.
ఇక ఈ చిత్రంలో అల్లు అర్జున్, మనోజ్, అనుష్క, మనోజ్ బాజ్పాయ్ ప్రధాన పాత్రలు చేస్తున్నారు. అల్లు అర్జున్..మాస్ కి ప్రతినిధిగా కనపడితే, మనోజ్..రాక్ స్టార్ గా కనువిందు చేయనున్నాడు. ఇక అనూష్క వేశ్యగా కనపడి కథకు కిక్కు ఇవ్వబోతోంది. అర్క మీడియా సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న ఈ చిత్రం జనవరిలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు రానుంది. సంక్రాంతి రిలీజ్ డేట్ చెయ్యాలని నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు.ఇక ఈ చిత్రం చివరి షెడ్యూల్ షూటింగ్ త్వరలో మొదలవుతుంది. ఈ సినిమాకి కీరవాణి సంగీత దర్శకుడు.త్వరలో ఆడియో సైతం రిలీజ్ కానుంది.


Click it and Unblock the Notifications











