Don't Miss!
- Technology ఆకట్టుకొనే డిజైన్, AI ట్రిపుల్ కెమెరా, 6.7 డిస్ప్లేతో మోటోరోలా స్మార్ట్ఫోన్.. విడుదల, సేల్ వివరాలు..!!
- News వైఎస్ కుటుంబంలో మరోసారి పోటీ ! ఫ్యామిలీని ఒప్పించబోతున్న షర్మిల-తర్వాతే ప్రకటన..
- Sports సన్రైజర్స్కు బ్యాడ్ న్యూస్.. నయా ఆల్రౌండర్ దూరం
- Finance IT News: టీసీఎస్ టెక్కీలకు శుభవార్త.. ఈ సారి జీతాల పెంపు ఎంత శాతమంటే..??
- Lifestyle ఈపాప చూడటానికి చాలా అందంగా ఉంది, కానీ ఓ వింత రోగం తినరానివి తింటుంది! నా కూతుర్ని రక్షించండి!!
- Automobiles కొత్తగా మారిన ప్రమాదానికి గురైన కారు - ఫిదా చేస్తున్న వీడియో!
- Travel హోలీ సందర్భంగా దేశంలోని ఈ ప్రదేశాలను చుట్టేయండి..!
‘మహానటి’తో... దర్శకులు క్రిష్, తరుణ్ భాస్కర్లకు లింకు!
సావిత్రి బయోపిక్ ‘మహానటి’లో దర్శకుడు క్రిష్, తరుణ్ భాస్కర్ కూడా ఓ చిన్న పాత్రలో కనిపించబోతున్నారు.
ప్రముఖ నటి సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం 'మహానటి'. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ సావిత్రి పాత్రలో ప్రేక్షకులను అలరించబోతోంది. ఒక సాధారణ కుటుంబం నుండి వచ్చిన సావిత్రి సినిమా రంగంలో మహానటిగా ఎదిగిన పరిణామాలతో పాటు, ఆమె జీవితంలో ఎదుర్కొన్న కష్టాలను సైతం చూపించనున్నారు.
ఎంతో ప్రతిష్టాత్మకంగా 'వైజయంతి మూవీస్', 'స్వప్న సినిమాస్' సంస్థలు నిర్మిస్తున్న ఈచిత్రంలో ఎంతో సినీ ప్రముఖులు భాగం కాబోతున్నారు. ప్రేక్షకులు ఊహించని ఎంతో మంది ప్రముఖులు చిత్రంలో కనిపించబోతున్నారు.
హైలెట్గా ‘మాయా బజార్’ ఎపిసోడ్
సావిత్రి సినీ జీవితంలో చెప్పుకోదగ్గ అత్యంత ముఖ్యమైన సినిమా ‘మాయా బజార్'. ఈ సినిమా ప్రస్తావన లేకుండా సావిత్రి బయోపిక్ తీయడం కష్టమే. అందుకే సినిమాలో ‘మాయా బజార్' ఓపిసోడ్ హైలెట్గా తెరకెక్కిస్తున్నారు. ఇందుకోసం రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేకంగా సెట్స్ వేశారు.
క్రిష్, తరుణ్ భాస్కర్
‘మాయాబజార్'ని తెరకెక్కించిన దర్శకుడు కె.వి.రెడ్డి పాత్రలో క్రిష్ నటిస్తున్నారు. ‘మాయాబజార్' చిత్రానికి కె.వి.రెడ్డి దగ్గర సహాయ దర్శకుడిగా పనిచేసిన ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావుగా తరుణ్ భాస్కర్ నటిస్తున్నారు.
కీలకమైన పాత్రలు
ఈ చిత్రంలో సావిత్ర భర్త జెమినీ గణేశన్ పాత్రలో దుల్కర్ సల్మాన్, జమున పాత్రలో సమంత, నిర్మాత చక్రపాణి పాత్రలో ప్రకాష్ రాజ్, ఎస్వీ రంగారావు పాత్రలో మోహన్ బాబు పోషిస్తున్నారు. వీరితో పాటు విజయ్ దేవరకొండ, షాలిని పాండే, మాళవిక నాయర్, రాజేంద్ర ప్రసాద్ కీలకమైన పాత్రల్లో కనిపించనున్నారు. 2018లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఫస్ట్ లుక్ రెస్పాన్స్ అదుర్స్
ఇటీవల సినిమా టైటిల్ పాత్రధారి కీర్తి సురేష్ పుట్టినరోజు సందర్భంగా ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ఆకాశ వీదిలో అందాల జాబిలిగా పేర్కొంటూ విడుదలైన ఈ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో కేవలం ఆమె కళ్లు మాత్రమే కనిపిస్తున్నాయి. ఆ కళ్లను చూస్తుంటే అచ్చం సావిత్రిని చూసినట్లే ఉండటం విశేషం.