Don't Miss!
- News దేవినేని ఉమకు కీలక బాధ్యత అప్పగించిన చంద్రబాబు..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- Sports ఖమ్మం క్లాసెన్..మెదక్ మార్క్రమ్: క్రియేటివిటీ కొట్టేవాడే లేడు భయ్యా
- Lifestyle Lok Sabha Election 2024:మరో 3 నెలల్లో పట్టాభిషేకం ఎవరికి? జ్యోతిష్యం ఏ పార్టీకి స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తోంది
- Finance Essential Medicines: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న అవసరమైన ఔషధాల ధరలు..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
గాలి జనార్థన్రెడ్డిని పోలి ఉందనే విమర్శపై దర్శకుడు క్రిష్
హైదరాబాద్ :దర్సకుడు క్రిష్ తాజా చిత్రం 'కృష్ణం వందే జగద్గురుమ్'సినిమాలోని రెడ్డప్ప పాత్ర గాలి జనార్థన్రెడ్డిని పోలి ఉందని అంటునే కామెంట్స్ వినిపిస్తున్న నేపధ్యంలో ఆయన వివరణ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ..నేను ఏ ఒక్కరినో లక్ష్యంగా చేసుకొని ఈ సినిమా తీయలేదు. జాతీయ సంపద దోచుకెళ్లే వారి గురించి సినిమా తీశాను. మట్టిని మెక్కేస్తోంటే.. గుడ్లప్పగించి చూస్తున్న బీటెక్ బాబుల గురించి ఈ సినిమా తీశాను అన్నారు.'కృష్ణం వందే జగద్గురుమ్'లో మైనింగ్ మాఫియా సమస్యకు నాటకం, జీవితం, భాగవతంతో అందమైన ముడివేశాడు.నాటక సమాజం, మైనింగ్ మాఫియా, భగవద్గీత సారాంశం వీటన్నింటినీ ఒకే కథలో మేళవించారు.
అలాగే ప్రేక్షకులను తక్కువగా అంచనా వేయడం నాకు ఇష్టం లేదు. వారిని ఎప్పుడూ నేను ఉన్నతంగానే ఊహిస్తా. అవినీతి అనేది అందరి సమస్య. నిత్యం కార్లలో తిరిగేవాడికి ఆ సమస్య అర్థమైనా కాకపోయినా.. రిక్షా తొక్కేవాడు తొందరగా అర్థం చేసుకొంటాడు. సినిమా చూసి చప్పట్లు కొట్టే వందమంది కంటే... 'అరె.. ఇది నిజమే కదా?' అని అప్రమత్తమయ్యే ఒక్క ప్రేక్షకుడే నాకు కావాలి. నాకు మట్టిరాజులు, టిప్పు సుల్తాన్లే కావాలి. నేనెప్పుడు కథ రాసుకొన్నా వారి కోణంలోంచే ఆలోచిస్తా అన్నారు.
'కృష్ణం వందే జగద్గురుమ్' నేను అనుకొన్న లక్ష్యాన్నినూటికి నూరు శాతం చేరుకొంది. 'గమ్యం', 'వేదం' సినిమాలు దర్శకుడిగా నాకు సంతృప్తినిచ్చాయి. మరోసారి ఆ తరహా సినిమాలే తీయడం నాకు ఇష్టం లేదు. 'ఏంటి? వీడికి ఇవి తప్ప మరేం రావా?' అనుకొంటారని భయం. ఒకే మూసలో ఇరుక్కుపోకూడదనే తాపత్రయం. అందుకే వ్యాపార సూత్రాలు మేళవించి ఓ సాహసోపేతమైన కథ చూపిద్దామనుకొన్నా. ఆ లక్ష్యం ఈ సినిమాతో అందుకొన్నా అని వివరణ ఇచ్చారు.
ఇక సినిమా అంటే వ్యాపారాత్మక కళ. నా ఉనికిని కాపాడుకొంటూ, నాకుగా నేను నిలదొక్కుకొంటూ డబ్బులొచ్చే సినిమా తీయాలి. 'గమ్యం'లాంటి సినిమా ఎవరు చూస్తారో నాకు తెలుసు. కాబట్టి దాన్ని పరిమిత బడ్జెట్లో తీశా. 'వేదం' సినిమాకు కొన్ని ప్రాంతాల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. ఇంకొన్ని చోట్ల ఓ మోస్తరు సినిమా అనే ముద్ర వేశారు. నాకిప్పుడు అందరినీ మెప్పించే సినిమా తీయడం అవసరం. స్టార్తో జత కడితే సినిమాకి మంచే జరుగుతుంది. ఆ కథకు వెయ్యి ఏనుగుల బలం వస్తుంది. 'వేదం' సినిమానే తీసుకోండి. అందులో అల్లు అర్జున్, అనుష్కలు లేకపోతే ఆ సినిమాని ఊహించుకోవడమే కష్టం. నా తరవాత సినిమా కూడా ఓ స్టార్ హీరోతో ఉంటుంది అని చెప్పుకొచ్చారు.