twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    గవర్నర్ గా కృష్ణం రాజు

    By Staff
    |

    Krishnam Raju
    కేంద్ర మంత్రి గా పనిచేసిన కృష్ణంరాజు బి.జె.పి పార్టీకి చెందిన వారు. ఆయన ఇప్పుడు గవర్నర్ అయ్యారు. అయితే పొలిటికల్ కెరీర్ లో కాదు. సినిమా లైఫ్ లో. శ్రీహరి హీరోగా రెడీ అవుతున్న శ్రీశైలం చిత్రంలో ఆయన ఆ గెటప్ లో కనిపించనున్నారు. అందులో ప్రాధాన్యత ఉన్న కాశ్మీరు గవర్నర్ గా ఆయన కథ లో కీలక మలుపుకు కారణమవుతారు. టెర్రరిజం నేఫద్యంలో జరిగే ఈ కథలో శ్రీహరి ఉమెన్స్ కాలేజీకి సంభందించిన బస్సు డ్రైవర్ గానూ,కరుడు కట్టిన తీవ్రవాదిగానూ,తర్వాత ఓ మంచి ట్విస్ట్ తో కనపడతారు.

    శ్రీహరి తో గతంలో సాంబయ్య,పోలీసు చిత్రాలు తీసిన కె.ఎస్.నాగేశ్వరరావు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కథంతా దేశ రక్షణ కోసం సైనికులు అవసరమున్నట్లే ,సమాజం సవ్యంగా ఉండాలంటే దేశం లోపలా అలాంటి కమిట్ మెంట్ ఉన్న వాళ్ళు అవసరం... అనే పాయింటు చుట్టూ తిరుగుతుంది. అలాగే ఈ చిత్రంలో నాగబాబు ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు.ఇక ఈ చిత్రానికి సంగీతం వి.శ్రీ సాయి అందిస్తూంటే మాటలు వెలిగొండ శ్రీనివాస్ సమకూరుస్తున్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X