Don't Miss!
- News ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై సస్పెన్షన్ వేటు
- Sports PBKS vs MI: చెలరేగిన సూరీడు... తెలుగోడు!
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
జూ ఎన్టీఆర్ నటనపై కృష్ణవంశీ కామెంట్...
మొగుడు చిత్రంతో త్వరలో ప్రేక్షకులు ముందుకు వస్తున్న దర్శకుడు కృష్ణవంశీ. ఆయన ఆదివారం రాత్రి ఓ పాపులర్ టీవీ ఛానెల్ ఇంటర్వూకు పిలిచినప్పుడు..ఆయన్ని మీ ఆలోచనలను సరిగ్గా వ్యక్తీకరించగల యాక్టర్ ఉన్నారా? అని అడగటం జరిగింది. అప్పుడు ఆయన...తారక్ ఈజ్ ఎక్స్లెంట్ ఇన్ రాఖీ. ఆ సినిమాలో మామూలు డైలాగుల్లోనే తీవ్రాతితీవ్రమైన ఆగ్రహాన్ని చూపించాలి. తారక్కు అది కొత్త. కానీ పెద్ద ఎన్టీఆర్నే మరిపించాడు. ఇక మురారిలో మహేశ్... బాగా సిగ్గరి అన్నారు. అలాగే మరి అమీర్ఖాన్లాంటి నటులు మనకు లేరన్నారు? అని అడిగితే...ఈ మధ్యనే అలా అనిపిస్తోంది. 'తారే జమీన్ పర్, లగాన్' వంటి సినిమాల వెనుక 19 ఏళ్ల పరిశ్రమ ఉంది. రంగేలీ సినిమాకి అమీర్తో కలిసి పని చేశా అని సమాధానమిచ్చారు. ఇక అక్కినేని కుటుంబం మూడు తరాలతో సినిమా చేస్తున్నారా అని అడిగిన పశ్నకు...ప్రస్తుతం కథా చర్చ నడుస్తోంది. నాగార్జున బాగా ఆసక్తిగా ఉన్నారు అని సమాధానమిచ్చారు. ఇక పాటల రచయిత సిరివెన్నెల అంటే ఎందుకంత అభిమానం అని అడిగితే...అదో విచిత్రబంధం. శివ టైంలో పరిచయం. ఆయన రాసిం ది ఫెయిర్ చేయడం, కోరిన సమాచారం ఇవ్వడం చేసేవాణ్ని అన్నారు. ఇక ఆయన మిమ్మల్ని దత్తత తీసుకున్నారా? అంటే... దాదాపు అలాంటిదే. గాయత్రి జంధ్యం వేసి క్రతువు జరిపించారు. మాది పూర్వజన్మ బంధమనిపిస్తుంది అని తేల్చి చెప్పారు.
గోపీచంద్, తాప్సీ జంటగా కృష్ణవంశీ రూపొందిస్తున్న 'మొగుడు' చిత్రం నవంబర్ 4 వ తేదీన విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) మీడియాకు తెలియచేసారు.. శ్రద్ధాదాస్ మరో హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. లక్ష్మీనరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి బేబి భవ్య సమర్పకురాలు. సంగీత దర్శకుడిగా బాబూశంకర్ పరిచయమవుతున్నారు. సీతారామశాస్త్రి, సుద్దాల అశోక్తేజ, రామజోగయ్యశాస్త్రి పాటలు రాశారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: శ్రీకాంత్, కూర్పు: గౌతంరాజు.
ఈ చిత్రం గురించి దర్శకుడు కృష్ణవంశీ మాట్లాడుతూ...'మగాడు మొగుడు అనిపించుకునేది కొందరే. అలాంటి మొగుడు కథతో తీస్తున్న చిత్రమిద'ని అన్నారు. 'పదేళ్ళుగా కృష్ణవంశీ దర్శకత్వంలో నటించాలని ఎదురుచూస్తున్నాను. అది ఇప్పటికి తీరింది అని గోపీచంద్ చెప్పారు. నాకున్న యాక్షన్ ఇమేజ్ను బ్రేక్ చేస్తూ ఈ చిత్రం రూపొందించార'ని అన్నారు.