twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రభాస్ తో మళ్ళీ పరాన్జీ?

    By Staff
    |

    Prabhas
    ప్రభాస్-కృష్ణంరాజు ల కాంబినేషన్ లో సినిమా రాబోతోందన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆ సినిమాను డైరక్ట్ చేసే సత్తా ఎవరికుందనే చర్చలు విస్తారంగా జరుగుతున్న నేఫద్యంలో జయంత్ పరాన్జీ తెరపైకి వచ్చారు. ప్రభాస్ ని 'ఈశ్వర్' అనే సినిమాతో పరిచయం చేసిన ఆయనే ఈ సినీ పగ్గాలు చేపట్టనున్నారని తెలిసింది. 'సఖియా..నాతో రా' ఫ్లాపుతో చాలా కాలంగా టాలీవుడ్ కి దూరంగా ఉన్నాయన ఇప్పుడీ సినిమాతో లైమ్ లైట్ లోకి వస్తున్నారు.

    ఆ మధ్య అంతా కొత్త వారితో సరికొత్త లవ్ స్టోరీకి శ్రీకారం చూట్టినాయన ఫైనాన్స్ ప్లాబ్లెమ్స్ వల్ల సినిమా రిలీజు గాక ఇబ్బందుల్లో ఉన్నారు. గోపీకృష్ణ బ్యానర్ పై నిర్మితమయ్యే ఈ సినిమాకు 'రాజు' అనే టైటిల్ పరిశీలనలో ఉందని తెలుస్తోంది. అలాగే 'బుజ్జిగాడు' తో నిరాశలో ఉన్న ప్రభాస్ కూడా కసితో ఎలాగైనా హిట్ నివ్వాలని ఈ చిత్రానికి పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. కృష్ణరాజు కూడా తన రెబెల్ స్టార్ ఇమేజ్ కి తగినట్లుగా క్యారెక్టర్ పవర్ ఫుల్ గా ఉండేటట్లు చూసుకున్నారని చెప్పుకుంటున్నారు. ఇలా అందరూ విజయం సాధించాలనే పట్టుదలతో రూపొందనున్న ఈ చిత్రం మంచి హిట్ కావాలని కోరుకుంది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X