Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
చిరంజీవి తాతను బూతుల నాయుడు అనే వాళ్లం
మెగాస్టార్ చిరంజీవి తాతను బూతుల నాయుడు మేము అనే వాళ్లం అంటూ చెప్పుకొచ్చారు ప్రముఖ నటుడు కృష్ణంరాజు. ఆయన నిన్న(ఆదివారం) రాత్రి ఓ టీవీ ఛానెల్ తో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని ఇలా అనేవాళ్ళం అంటూ గతాన్ని గుర్తు చేసుకున్నారు. చిరంజీవిది మీ ఊరే కదా...ఎప్పుడైనా కలిసేవారా అని అడిగిన ప్రశ్నకు ఇలా స్పందించారు. అలాగే చిరంజీవి..మా తమ్ముళ్లకు తెలుసు గానీ, నాకు అప్పట్లో పరిచయం లేదు. కలవలేదు. మద్రాసులోనే కలిశాను. వాళ్ల గ్రాండ్ పేరెంట్స్ బాగా తెలుసు అన్నారు. ఇక చిరంజీవిది, కృష్ణంరాజుదీ పశ్చిమగోదావరి జిల్లాలోని మొగల్తూరు గ్రామం. ఇక కృష్ణరాజుని మీ భవిష్యత్తు లక్ష్యం ఏమిటి అని అడగగా..అందరూ గుర్తు పెట్టుకునేలా పిచ్చిపుల్లయ్య, బీదల పాట్లు అనే రెండు మంచి ఎన్టీఆర్ తీశారు. సత్యజిత్ రే తీసిన లాంటి సినిమాలు తీయాలన్న ఉద్దేశం ఉంది. దేశ, అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమాకు గుర్తింపు తీసుకురావాలి. ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టాను అన్నారు.అలాగే తన వారసుడు హీరో ప్రభాస్ అన్నారు.