Don't Miss!
- News సచివాలయ ఉద్యోగులకు ఎన్నికల విధులపై కీలక నిర్ణయం..!!
- Lifestyle ఈ రోజు రాశి ఫలాలు: ఓ రాశి వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి..సమస్యలు పెరుగుతాయి
- Finance Gold Rate: మిసైల్ వేగంతో పెరిగిన పసిడి.. నిన్న పడింది నేడు పుంజుకుంది..
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
- Sports వరుస పరాజయాల వేళ.. ఆర్సీబీ, కోహ్లీ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్
- Technology గూగుల్ మ్యాప్స్ కొత్త ఫీచర్ గురించి తెలుసా.. రోడ్ ట్రిప్ సహా ప్రయాణాల్లో ఆందోళన ఉండదిక...!
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
"కేసీఆర్లో కృష్ణదేవరాయలు కనిపించారు, ఒకప్పుడు ఎన్టీఆర్.. ఇప్పుడు కేసీఆర్"
కేసీఆర్ మాట్లాడుతుంటే చూపు తిప్పుకోవడం కష్టం. అదే పనిగా చూస్తే.. ఇలియానా అందమైన బోర్ కొట్టొచ్చు కానీ.. కేసీఆర్ వాగ్ధాటి ఎన్ని గంటలైనా మంత్ర ముగ్దుల్ని చేస్తుంది. దర్శకుడు రాంగోపాల్ వర్మ చెప్పిన ఈ మాటలు కొట్టిపారేసేవేం కాదు.
Recommended Video
కేసీఆర్ ఎంఏ చదువుతున్న రోజుల్లో: ఆ ముగ్గురు మాట్లాడుతుంటే.. అలా వింటుండేవాడు!
రాజకీయంగా ఎన్ని విభేదాలున్నా.. వాగ్ధాటి విషయంలో ప్రత్యర్థులు సైతం కేసీఆర్ చాతుర్యాన్ని పక్క చాటుగానైనా మెచ్చుకోకుండా ఉండలేరు. తెలుగు భాషపై ఆయనకున్న పట్టు.. విషయాన్ని ప్రజలకు కమ్యూనికేట్ చేయడంలో ఆయనకున్న నేర్పు అలాంటివి.
ప్రపంచ తెలుగు మహాసభల నేపథ్యంలో మరోసారి కేసీఆర్ తన తెలుగు భాషా చాతుర్యాన్ని బయటపెట్టారు. తాజాగా ఇదే విషయంపై సీనియర్ హీరో కృష్ణంరాజు స్పందించారు.
కృష్ణదేవరాయలను తలపించేలా:
'ప్రపంచ తెలుగు మహాసభలలో కేసీఆర్ గారి ప్రారంభోపన్యాసం విన్నప్పుడు.. సినిమాల్లో కృష్ణదేవరాయల పాత్ర పోషించిన నాకు అష్టదిగ్గజాల సమేతంగా స్వయంగా పండితుడై తెలుగు భాషను అత్యున్నత శిఖరాలకు చేర్చిన ఆ కృష్ణదేవరాయలు కేసీఆర్లో కనిపించారు.' అని కృష్ణంరాజు అన్నారు.
తెలుగు భాషపై పట్టు:
'నాకు తెలుసు.. కేసీఆర్ వేలాది పుస్తకాలు చదివారు. వేలాది పద్యాలను కంఠత పట్టినారు. అందుకే తెలుగు భాష మీద ఆయనకు ఉన్న పట్టేమిటో ఆయన ప్రారంభోపన్యాసంలో కనిపించింది. తెలుగు భాష మీద కేసీఆర్గారికి గల అభిమానం ఏమిటో ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణలో, తెలుగు భాషను ప్రపంచ వ్యాప్తంగా విస్తృతం చేయడంలో కనిపించింది.'
ఒకప్పుడు ఎన్టీఆర్..
'మహానుభావుడు ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రి అయి.. తెలుగు భాషకు, తెలుగువారికి ప్రపంచవ్యాప్తంగా గౌరవప్రదమైన స్థానాన్ని కల్పించారు. ఇప్పుడు బాహుబలి సినిమా దర్శకుడు రాజమౌళి, హీరో ప్రభాస్ ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా హాలీవుడ్ సినిమాకు ఏమాత్రం తక్కువ కాదు అని నిరూపించారు.'
ఇప్పుడు కేసీఆర్:
'రాజకీయ నాయకుడిగా ఎన్టీఆర్ గారికి, దర్శకుడిగా రాజమౌళి, ఇంత బ్రహ్మాండంగా ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించిన కేసీఆర్గారికి, యువనేత కేటీఆర్గారికి మనస్ఫూర్తిగా శుభాభినందనలు తెలియజేస్తున్నాను.'
ఇదే స్ఫూర్తితో ప్రతి తెలుగువాడు వారి వారి వృత్తిలో తెలుగు జాతిని, తెలుగు ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేయడానికి కృషిచేయాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
ఎందుకు రాలేదంటే?:
ప్రపంచ తెలుగు మహా సభలకు హాజరుకాకపోవడంపై కృష్ణం రాజు స్పందించారు. డిసెంబర్ 18న ఎల్బీ స్టేడియంలో జరిగిన వేడుకకు సినీ ప్రముఖులంతా హాజరైన సంగతి తెలిసిందే. అయితే తన గైర్హాజరి వెనుక సమాచార లోపమే తప్ప మరే ఇతర కారణాలు లేవన్నారు.