Don't Miss!
- News AP Pre-Poll Survey: ఏపీ ఎన్నికల్లో జనం పల్స్ క్లియర్ ! ఎన్ని సీట్లో తెలుసా ? లేటెస్ట్ సర్వే..
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. లాంచ్, స్పెసిఫికేషన్ల పూర్తి వివరాలు..!!
- Sports ధోనీని ఒప్పించడం కష్టమే..ఆ ఫేక్ న్యూస్ నమ్మొద్దు- రోహిత్
- Lifestyle Marriage Day Wishes in Telugu : పెళ్లిరోజు శుభాకాంక్షల సందేశాలను ఇలా పంపండి..
- Automobiles జాన్ అబ్రహం మనసుదోచిన కొత్త బైక్ ఇదే!.. మీరూ చూడండి
- Finance Just Dial Stock: జస్ట్ డయల్ స్టాక్ రికార్డుల మోత.. ఇంట్రాడేలో 13 శాతం అప్.. అదే కారణం..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
My Boy Friends Girl Friend Trailer పైన పార్ట్, కింద పార్ట్ అంటూ రచ్చ.. ఒకేసారి ఇద్దరితో..
ప్రస్తుతం తెలుగులో కొత్త పోకడలు వచ్చేశాయ్. దీనికి తగ్గట్టు ఈ కరోనా, లాక్ డౌన్, ఓటీటీ వంటివి బాగానే పాపులర్ అయ్యాయి. కరోనా వైరస్ విజృంభించడం లాక్ డౌన్ విధించడం, తద్వారా ఓటీటీలకు తెలుగు జనాలు బాగా అలవాటు పడ్డారు. దీంతో కొత్త కొత్త పోకడలతో దర్శక నిర్మాతలు రంగంలోకి దిగుతున్నారు. బోల్డ్ కంటెంట్, డబుల్ మీనింగ్ డైలాగ్లతో శ్రుతి మించిపోతున్నారు. ఇక ఓటీటీయే కాబట్టి సెన్సార్ కూడా అవసరం లేదని రెచ్చిపోతున్నారు. తాజాగా ఓ మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. అది సోషల్ మీడియాలో పెడుతున్న చిచ్చు అంతా ఇంతా కాదు.
Recommended Video
ఆమధ్య డర్టీ..
నిర్మాత ఎంఎస్ రాజు ఆ మధ్య డర్టీ హరి అంటూ నానా రచ్చ చేసిన సంగతి తెలిసిందే. ఎంఎస్ రాజు దర్శకుడిగా మారి నేటి యువతను టార్గెట్ చేస్తూ పాటలు, టీజర్, ట్రైలర్ను రిలీజ్ చేశాడు. ఇక అప్పట్లో డర్టీ హరి సృష్టించిన వివాదం అంతా ఇంతా కాదు. రెచ్చిపోయి మరీ హద్దులు దాటేశారు. మితిమీరిన శృంగార సన్నివేశాలతో రెచ్చిపోయారు.
తాజాగా కృష్ణుడు
వినాయకుడు ఫేమ్ కృష్ణుడు నిర్మాతగా మారి‘మై బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్' అనే చిత్రాన్ని ప్రేక్ఖకుల ముందుకు తీసుకురాబోతోన్నాడు. ఇక ఇది పక్కా యూత్ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. ఈ మధ్యే ప్రబాస్తో మౌత్ టాక్ చేయించి ఫస్ట్ లుక్కు కూడా రిలీజ్ చేయించాడు.
ఇప్పుడేం చేయాలి...! ఇప్పటికే దరఖాస్తు
దేశంలోకి కలర్ టీవీల దిగుమతులపై జూలై 31న కేంద్రం ఆంక్షలు విధించింది. కలర్ టీవీల దిగుమతి విధానాన్ని స్వేచ్ఛా విభాగం నుండి తొలగించి, పరిమిత విభాగానికి మార్చింది. దీంతో దిగుమతులు చేసుకోవాలంటే వాణిజ్య మంత్రిత్వ శాఖ నుండి లైసెన్స్ పొందాలి. దేశంలోకి కలర్ టీవీలు అధికంగా దిగుమతి అయ్యేది చైనా నుండి కాబట్టి ఈ నిర్ణయం తీసుకుంది కేంద్రం. అయితే శాసంగ్, టీసీఎల్, సోనీ వంటి కంపెనీలు ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నాయట. అయితే అనుమతులు ఎప్పుడు వస్తాయో క్లారిటీ లేదు.
ట్రైలర్ విడుదల..
ఇక ప్రభాస్ ప్రమోట్ చేస్తే సినిమాపై బజ్ క్రియేట్ కాకుండా ఉంటుందా? ‘మై బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్' అనే సినిమా రాబోతోందని ఓ పది మందికి తెలిసింది. ఇక తాజాగా విడుదల చేసిన ట్రైలర్తో దాదాపు అందరికీ తెలిసేలా ఉంది. సినిమాలో డబుల్ మీనింగ్ డైలాగ్స్, ట్రయాంగల్ లవ్ స్టోరీ, కామెడీ, యాక్షన్ ఇలా అన్నీ ఓ రేంజ్లో పేలాయి.
ట్రయాంగిల్ లవ్ స్టోరీ..
ఇక ఈ సినిమాలో హీరో ఇద్దరమ్మాయిలను ఒకేసారి ప్రేమించడం.. వారితో ప్రయాణం, పెళ్లి, రొమాన్స్ నేపథ్యంలో ‘మై బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్' ఉండోబోతోందని క్లియర్గా అర్థమవుతోంది. మధ్యలో కామెడీ సీన్స్ బాగానే ఉన్నా.. డైలాగ్స్ మాత్రం శృతిమించినట్టు కనిపిస్తోంది.
పైన పార్ట్ కింద పార్ట్..
ఇద్దరమ్మాయిల్లో (బ్రెట్నీ, మధు) ఎవరు కావాలో తేల్చుకోలేని హీరో.. ‘పైన పార్ట్ మధు కావాలని కోరుకుంటోంది.. కింద పార్ట్ బ్రెట్నీ కావాలని కోరుకుంటోంది' అని చెప్పడం హైలెట్గా నిలిచింది. ఇక చివరకు హీరో సంగతి తెలిసి హీరోయిన్లు నిలదీయడం.. ఇద్దరినీ ఒకేసారి ఎలా ప్రేమిస్తావ్? ఇద్దరూ సమానమే అని ఎలా చెబుతావ్ అంటూ క్లాస్ పీకడం బాగానే ఉంది. మొత్తానికి ఈ చిత్రం ట్రైలర్తో టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది.