twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శ్వేతాబసు చివరకు కృష్ణుడుతో కూడా

    By Srikanya
    |

    కొత్త బంగారులోకం చిత్రంతో పరిచయమైన శ్వేతాబసు ఇప్పుడు కృష్ణుడుతో ఓ చిత్రం కమిటైంది.చేతిలో ఒక్క ఆఫరూ లేకపోవటంతో ఆమె పరిస్ధితి డైలమోలో పడింది.ఆఫర్స్ కోసం ఎదురుచూపులు చూసిన ఈ చిన్నది భారిగా శరీరం పెంచేయటంతో కృష్ణుడు సరసన సూటువుతుందని బుక్ చేసారు.అంతేగాక వరుడు చిత్రంలో అల్లు అర్జున్ సరసన చేసిన బాను మెహ్రాని రాజీవ్ కనకాల సరసన తీసుకుని ఈ చిత్రాన్ని ప్రారంభించారు. రాజీవ్‌ కనకాల, కృష్ణుడు, సుమిత్‌ అరోరా ప్రధాన పాత్రధారులుగా చందు చిత్రం సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. శ్వేతాబసు ప్రసాద్‌, భానుశ్రీ మెహ్రా హీరోయిన్స్ . మధుసూధన్‌ దర్శకుడు. చందు నిర్మాత. హైదరాబాద్‌లో ప్రారంభమైందీ చిత్రం. దర్శకుడు మాట్లాడుతూ ''వినోదానికి ప్రాధాన్యమున్న చిత్రమిది. చక్కటి సందేశం మిళితమై ఉంటుంది. హైదరాబాద్‌, బెంగుళూరు, ఊటీల్లో చిత్రీకరణ చేస్తాం. జనవరి చివరి వారంలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామ''న్నారు. పోసాని కృష్ణమురళి, రోజా, దేవరాజ్‌, కొండవలస తదితరులు ఇతర పాత్రధారులు. సంగీతం: వందేమాతరం శ్రీనివాస్‌

    కొత్త బంగారులోకం'తో ఒక్కసారిగా రాత్రికి రాత్రి స్టార్ గా మారిన శ్వేత బసు ప్రసాద్ ఆ తర్వాత దానిని నిలబెట్టుకోలేకపోయింది. సరైన సినిమాలు ఎంపికచేసుకోలేక, శరీరాన్ని సరిగ్గా మెయింటైన్ చేయక మిగిలిపోయింది. దాంతో రైడ్, కాస్కో, కళావర్ కింగ్ అంటూఒక్కో సినిమాకూ వెనక్కి వెళ్ళిపోసాగింది. ఇక ఆమె ఉదయ కిరణ్ తో చేసిన నువ్వేక్కడుంటే-నేనక్కడుంటా అయితే రిలీజ్ అవుతుందో లేదో కూడా తెలియని సిట్యువేషన్. ఇక ఆమె పరిస్ధితి ఎంత స్దాయికి వచ్చిందంటే...న్యూ ఇయర్ నైట్ వేడుకల్లో కాకినాడలో స్టేజి పై డాన్స్ చేసే స్ధితికి చేరుకుంది. ఈ పరిస్ధితుల్లో కృష్ణుడుతో సినిమా అన్నా మహా ప్రసాదం అనుకుంటోందామె. అది పరిస్ధితి.

    English summary
    Krishnudu is about to start work on a new film that will see him being paired with Swetha Basu for the first time.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X