twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కృష్ణుడు ‘వైకుంఠపాళి’ఆడే రోజు ఎప్పుడు అంటే...

    By Srikanya
    |

    కృష్ణుడు, అజయ్, రణధీర్ ప్రధాన పాత్రధారులుగా హరేరామ హరేకృష్ణ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై అనిల్ గోపీరెడ్డి దర్శకత్వంలో భువనేశ్వర్ మారం, సత్యజిత్‌రెడ్డి పందెం నిర్మించిన చిత్రం 'వైకుంఠపాళి". ప్రస్తుతం ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈనెల 27న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో చిత్ర దర్శకుడు అనిల్‌గోపీరెడ్డి మాట్లాడుతూ..'ముగ్గురు హీరోలతో నిర్మాణమైన ఈ చిత్రం అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది. తషు కౌశిక్ నటన ఈ చిత్రానికి ప్లస్ పాయింట్. ఈ చిత్రం ప్రివ్యూ చూశాక మాకు చిత్రం విజయం సాధిస్తుందన్న నమ్మకం కుదిరింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి 27న చిత్రాన్ని విడుదల చేస్తున్నామ"ని వివరించారు. తనికెళ్ల భరణి, పోసాని కృష్ణమురళి, సుబ్బరాజు, సన, హర్షవర్ధన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: జవహర్‌రెడ్డి, సంగీతం: అనిల్ గోపిరెడ్డి, పాటలు: రామజోగయ్యశాస్ర్తీ, అవినాష్, నిర్మాతలు: భువనేశ్వర్ మారం, సత్యజిత్‌రెడ్డి పందెం. కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అనిల్ గోపిరెడ్డి.

    English summary
    Krishnudu, Ajay, Tashu Kaushik, Ranadheer starrer romantic comedy 'Vykuntapali' will release on May 27th. Anil Gopireddy is the director for this movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X