Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
షూటింగ్లో గాయపడిన '1 నేనొక్కిడినే' హీరోయిన్
హైదరాబాద్: మహేష్ బాబు సరసన 1 నేనొక్కిడినే చిత్రంలో నటించిన కృతి సనన్ గుర్తుంది కదా. ఆ తర్వాత ఆమె నాగ చైతన్య తో దోచెయ్ చిత్రం చేసింది. కానీ తెలుగులో కంటిన్యూగా ఆఫర్స్ రాకపోవటంతో బాలీవుడ్ లో సెటిల్ అయ్యే ప్రయత్నాలు చేస్తోంది.
అందులో బాగంగా కృతిసనన్ ప్రస్తుతం సుషాంత్ సింగ్ రాజ్పుత్కి జంటగా రాబ్తా చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హంగేరి రాజధాని బుడాపెస్ట్లో జరుగుతోంది. సినిమాలో కృతి ఓ భవనంపైకి ఎక్కి పరిగెత్తే సన్నివేశం చేయాల్సి ఉంది. షూటింగ్ సమయంలో కృతి ప్రమాదవశాత్తూ కిందపడింది.
అదృష్టవశాత్తు పెద్ద ప్రమాదం లేకపోయినా కాలికి స్వల్ప గాయమైంది. చిత్రబృందం వెంటనే వైద్యుడిని పిలిపించి చికిత్స అందించారు. రెండు రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. దినేశ్ విజన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం 2017 ఫిబ్రవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.