Don't Miss!
- News అప్పుడు వైసీపీ..ఇప్పుడు టీడీపీ.. యంగ్ హీరో ఇలా మారిపోయాడేంటి..!
- Sports T20 World Cup 2024: సంజూ శాంసన్కు మళ్లీ అన్యాయమే!
- Technology వన్ప్లస్ 13 స్మార్ట్ఫోన్ కీలక వివరాలు లీక్.. 6.8 అంగుళాల డిస్ప్లే, 50MP కెమెరా సహా.. పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
అమితాబా.. చిరంజీవా అనుకున్నారు.. అందుకే సినిమా కొనలేదు: నిర్మాత వ్యాఖ్యలతో కలకలం
తెలుగు హీరోయిన్ ఐశ్వర్యా రాజేష్, రాజేంద్రప్రసాద్, కార్తీక్ రాజు, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రల్లో.. టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన చిత్రం 'కౌసల్య కృష్ణమూర్తి'. ది క్రికెటర్ అనేది టాగ్లైన్. ఈ సినిమాను సీనియర్ ప్రొడ్యూసర్ కేఎస్ రామారావు సమర్పణలో కేఏ వల్లభ నిర్మిస్తున్నారు. ఇందులో శివ కార్తికేయన్ కీలక పాత్రలో కనిపించనున్నాడు.
తమిళంలో 'కనా' అనే పేరుతో విడుదలై ఘన విజయం సాధించిన సినిమాను తెలుగులోకి రీమేక్ చేశారు. దీనికితోడు ఈ సినిమా క్రికెట్ బ్యాగ్డ్రాప్లో రూపొందడంతో దీనిపై అంచనాలు భారీగానే ఉన్నాయి. 'కౌసల్య కృష్ణమూర్తి' ఆగస్టు 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ, రాశీ ఖన్నా ముఖ్య అతిథులుగా విచ్చేశారు.
ఈ కార్యక్రమంలో చిత్ర నిర్మాత కేఎస్ రామారావు చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. 'కెరీర్ బిగినింగ్ నుంచి మంచి రచయితలు, కథలు, దర్శకులు కుదిరారు కాబట్టే నా బ్యానర్లో మంచి సినిమాలొచ్చాయి. ఆ గొప్పతనం నాది కాదు. నా బ్యానర్లో పని చేసిన వాళ్లది. ఈ చిత్రం నా బ్యానర్లో మరో మంచి సినిమా అవుతుంది.
ప్రపంచవ్యాప్తంగా నేనే విడుదల చేస్తున్నా. నా సినిమా రిలీజ్ చేయడానికి ముందుకొచ్చిన మిత్రులకు, పెద్ద సినిమాలే రిలీజ్ చేస్తూ, ఈ చిత్రాన్ని కొనడానికి ముందుకురాని నా శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు. సినిమాను అమ్మడానికి నేను ప్రయత్నించాను. కానీ, ఐశ్వర్యా రాజేశ్ అనే అమ్మాయి అమితాబ్ బచ్చనా..? చిరంజీవా..? అని అనుకున్నారేమో ఎవరూ ముందుకు రాలేదు' అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.