హరికృష్ణ అంత్యక్రియల కార్యక్రమంలో మార్పు.. కుటుంబ సభ్యుల కోరిక మేరకు!
నందమూరి హరికృష్ణ నేటి ఉందయం నల్గొండ సమీపంలో ప్రమాదానికి గురై మరణించిన సంగతి తెలిసిందే. నందమూరి కుటుంబ సభ్యులు, అభిమానులు హరికృష్ణ మృతితో శోక సంద్రంలో మునిగిపోయారు. ఇదిలా ఉండగా రేపు హరికృష్ణ అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు.
హరికృష్ణ చివరి మజిలీ.. ఎన్టీఆర్ను పరామర్శించిన కేసీఆర్.. ప్రముఖుల శ్రద్దాంజలి (ఫొటోలు)
అధికారిక లాంఛనాలతో హరికృష్ణ అంత్యక్రియలు జరుపుతామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ముందుగా మొయినాబాద్ లోని హరికృష్ణ ఫామ్ హౌస్ లో అంత్యక్రియలు నిర్వహించాలని అనుకున్నారు. కానీ రేపు 3 గంటల నుంచి 5 గంటల మధ్యలో జూబ్లీహిల్స్ లోని మహా ప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు జరగనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం తరుపున కేటీఆర్ అధికారికంగా ప్రకటించారు.

హరికృష్ణ, నందమూరి కుటుంబ సభ్యుల కోరిక మేరకు.. ఏపీ సీఎం చంద్రబాబు సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేటీఆర్ ప్రకటించారు. మరో వైపు సీఎం కేసీఆర్ హరికృష్ణ భౌతిక కాయానికి నివాళులు అర్పించి ఎన్టీఆర్ ని ఓదార్చారు.


Click it and Unblock the Notifications











