Don't Miss!
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Automobiles భారత్లో లాంచ్ అయిన సుజుకి కొత్త బైక్ ఇదే.. ధర ఎంతో తెలుసా?
- News ఇంటర్ కళాశాలకు వేసవి సెలవులు...ఎప్పటినుంచంటే..?
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Sports SRH Playing XI: ఆ బౌలర్పై వేటు.. గుజరాత్తో తలపడే సన్రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు ఇదే!
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ప్రశ్నించిన డైరెక్టర్ మారుతి.. వెంటనే శుభవార్త చెప్పేసిన కేటీఆర్
Recommended Video
రాజకీయ రంగంలో, సినీ రంగంలో మారుతున్న కాలానికి తోడు యువ నాయుకులు, యువ దర్శకులు సరికొత్త అడుగులు వేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కేటీఆర్ చూపుతున్న చొరవ జనం మెప్పు పొందుతోంది. దేశానికే ఆదర్శనీయంగా భారీ వ్యయంతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం తెలంగాణ కీర్తి ప్రతిష్టలను ప్రపంచానికి చాటి చెప్తోంది. కాగా ఇటీవలే ఓ ఆంగ్ల దినపత్రిక హైదరాబాద్ లోని నీటి సమస్య గురించి ఓ కథనం ప్రచురించింది. ఈ వార్తను కేటీఆర్కి ట్యాగ్ చేస్తూ నిజమా సర్? అని ప్రశ్నించారు మారుతి.
కాళేశ్వరం విషయమై ట్విట్టర్లో కేటీఆర్.. మారుతి ప్రశ్న
దేశంలోనే ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు కాళేశ్వరం అని, ఈ ప్రాజెక్టు ఫలాలు త్వరలోనే హైదరాబాద్కి అందుతాయని, నగరంలోని నీటి అవసరాలు మొత్తం తీరిపోతాయని ట్విట్టర్లో పేర్కొన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అయితే ఈ ట్వీట్స్ చూసిన డైరెక్టర్ మారుతి.. హైదరాబాద్లో మరో 48 రోజుల్లో నీటి కరువు వస్తుందని, నీళ్లు దొరకవంటూ ఆంగ్ల పత్రికలో వచ్చిన కథనాన్ని ట్యాగ్ చేస్తూ ఇది నిజమా? సర్ అని ప్రశ్నించాడు.
అది ఖచ్చితమైన రిపోర్ట్ కాదు
మారుతి ప్రశ్నకు వెంటనే బదులిచ్చిన కేటీఆర్.. ఆంగ్ల పత్రిక ప్రచురించిన ఆ రిపోర్ట్ సరైంది కాదని రిప్లై ఇచ్చారు. హైదరాబాద్ నగరానికి తాగునీటి పరంగా ఎలాంటి సమస్య లేదని ఆయన అన్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ఫలాలు అతిత్వరలో హైదరాబాద్ వాసులకు అందుబాటు లోకి రానున్నాయని పేర్కొన్నాడు.
|
హైదరాబాద్కు 175 ఎంజీడీల నీరు
ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టు పనులు చురుకుగా సాగుతున్నాయని, ఇప్పటికే ప్రాణహిత ఎత్తిపోతలు షురూ అయ్యాయని, అలాగే మరికొద్ది రోజుల్లోనే ఎల్లంపల్లి ఎత్తిపోతల పనులు ప్రారంభం కానున్నాయని ఆయన ట్వీట్ చేశారు. ఈ మేరకు హైదరాబాద్కు 175 ఎంజీడీల నీరు అందుబాటులోకి రానుందని, నీటి గురించి ఏ మాత్రం చింతించాల్సిన పని లేదని కేటీఆర్ తెలిపారు.
|
శుభవార్త చెప్పారంటూ
డైరెక్టర్ మారుతి వేసిన ప్రశ్నపై కేటీఆర్ స్పందన పలువురిని ఆకట్టుకుంది. అయితే కేటీఆర్ రిప్లై పై తిరిగి స్పందించిన మారుతి.. ధన్యవాదాలు సర్, శుభావార్త చెప్పారు అని పేర్కొన్నాడు. నిజానికి గత కొద్ది కాలంగా నీటి సమస్యతో తల్లడిల్లుతున్న జనానికి ఇది శుభావార్తే మరి. తెలంగాణ రాష్ట్రంలోని నీటి కష్టాల పట్ల ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు హర్షణీయం అంటున్నారు జనం.
మెగా మేనల్లుడితో మారుతి
మారుతి ప్రస్తుతం మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా కొత్త సినిమా రూపొందిస్తున్నాడు. యూవీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ 2 బ్యానర్స్పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ సరసన రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది. చిత్రానికి 'ప్రతీ రోజు పండగే' అనే టైటిల్ కన్ఫర్మ్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది.