Don't Miss!
- Lifestyle ప్రేమ విషయంలో ఈ రాశులను మాత్రం అస్సలు నమ్మకూడదు..నమ్మక ద్రోహం చేస్తారు..
- Sports India squad for T20 World Cup: ఏడుగురు స్పెషలిస్ట్ బ్యాటర్లు.. తెలుగోడికి నో ఛాన్స్!
- News విశాఖలో కూటమికి బిగ్ షాక్.. వైసీపీలో చేరిన కీలక నేత
- Automobiles క్రాష్ టెస్ట్లో శభాష్ అనిపించిన కియా కేరెన్స్.. ఆ విభాగంలో 5 స్టార్ రేటింగ్
- Technology స్మార్ట్వాచ్ సెగ్మెంట్లోకి ప్రముఖ సంస్థ.. 8 రోజుల బ్యాటరీ లైఫ్, హెల్త్ ట్రాకర్లతో ProWatch విడుదల..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
'చిరుత' హీరోయిన్ తో భలే 'కుర్రాడు'
ఆనంది ఆర్ట్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం కుర్రాడు. వరుణ్ సందేశ్ కథానాయకుడిగా, నేహా శర్మ (చిరుత హీరోయిన్) కథానాయిక. ఈ చిత్రం ద్వారా గుణ్ణం సందీప్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. 'పోరంబోకు" తమిళ్ సినిమాను కుర్రాడుగా రూపొందుతోంది. ఈ సినిమా చిత్రీకరణ కార్యక్రమాలు పూర్తయ్యాయి. పోస్ట ప్రొడక్స్ న్ పని కూడా చివరి దశలో ఉందన్నారు.
ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ 'ఆద్యంతం వినోదాత్మకంగా సాగే చిత్రమిది. నేటి తరం ప్రేక్షకులకు నచ్చే అంశాలు పుష్కలంగా ఉన్నాయి, హీరో పాత్ర భాగుంటుంది. చూసిన వాళ్లు తప్పకుండా భలే కుర్రాడే అంటారు. నిర్మాణాంతర కార్యక్రమాలు తుది దశకు చేరాయన్నారు. ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయంటున్నార. సెప్టెంబరు 4న ఆడియో విడుదల చేయడానికి సన్నహాలు సిద్ద చేసిన విషయం తెలిసిందే. అయితే ఊహించని విధంగా ముఖ్యమంత్రి ప్రమాదంలో దుర్మరణం పొందారని తెలియడంతో రాష్ట్రవ్యాప్తంగా ఉద్విగ్న పరిస్థితులు నెలకొనడంతో గుణ్ణం సందీప్ సమయోచితంగా వ్యవహరించి సినిమా ఆడియో విడుదలను ఒకటి రెండు రోజులు వాయిదా వేస్తున్నామన్నారు. విడుదల తేదిని తిరిగి ప్రకటిస్తామన్నారు. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ అచ్చు సంగీతాన్ని అందిస్తున్నారు. బోమ్మాళి రవి, తనికెళ్ల భరణి,ఆలీ, ఎమ్మెస్ నారాయణ, వేణు, నవీన్ తదితరులు ఈ సినిమాలో నటిస్తున్నారు.