Don't Miss!
- News కాంగ్రెస్ ఖమ్మం సీటు పంచాయితీలో అనూహ్య మలుపు..!!
- Technology జియో సినిమా యాప్లో IPL మ్యాచ్లను ఉచితంగా చూస్తున్నారా.. రేపు కీలక ప్రకటన??
- Sports ఆ రూల్ వల్లే గెలిచాం- KL రాహుల్
- Automobiles క్రాష్ టెస్ట్లో హోండా అమేజ్కు గట్టి షాక్.. ఆ విభాగంలో ‘0' రేటింగ్.!!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
కళాభవన్ మణి మృతిపై ట్విస్ట్: విషం ఉందని తేల్చారు!
కొచ్చి: ప్రముఖ మలయాళ నటుడు కళాభవన్ మణి మార్చి మొదటి వారంలో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన మరణం సహజంగా లేదని, అనేక అనుమానాలున్నాయని మొదటి నుండి పలు వాదనలు వినిపిస్తున్నాయి. తాజాగా విడుదలైన ఫోరెన్సిక్ రిపోర్టుతో అనుమానాలు మరింత బలపడ్డాయి.
ఆయన దేహంలో అత్యంత విషపూరితమైన మిథైల్ ఆల్కహాల్(మిథనాల్) అవశేషాలు ఉన్నట్లు ఫోరెన్సిక్ నివేదిక తేల్చింది. హైదరాబాద్ కు చెందిన సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ నిర్వహించిన టెస్టుల్లో ఇది రుజువైంది. అయితే అది ఆయన మరణానికి ఎంతవరకు కారణం అయిందనేది తేలాల్సి ఉంది.
ఇంతకు ముందు కొచ్చిలోని ప్రాంతీయ రసాయన పరీక్ష కేంద్రంలో జరిపిన టెస్టులో ఆయన శరీరంలో ప్రమాద కరమైన 'క్లోర్ పిరిఫోస్' అవశేషాలు ఉన్నట్లు రిపోర్టు వచ్చారు. అయితే తాజాగా హైదరాబాద్ లో జరిగిన టెస్టులో మాత్రం ఆయన శరీరంలో పురుగు మందు అవశేషాలే ఏమీ లేవని తేలిపోయింది. అయితే ఒక్కో రిపోర్టు ఒక్కో రకంగా రావడంతో పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు.
మరో వైపు కేరళలోని ఆయన అభిమానులు కూడా ఈ రిపోర్టతో అయోమయానికి గురవుతున్నారు. తమ అభిమాన నటుడి మరణం విషయంలో ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోవడం వారిని షాక్ కు గురి చేస్తోంది.