Don't Miss!
- News సీఎం జగన్పై రాళ్లదాడి కేసులో బొండ ఉమ అరెస్ట్..?
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
న్యూ ఇయర్ కానుక: లచ్చిందేవికి ఓలెక్కుంది
నవీన్చంద్ర, లావణ్య త్రిపాఠి జంటగా మయూఖ క్రియేషన్స్ బ్యానర్పై జగదీశ్ తలశిల దర్శకత్వంలో సాయిప్రసాద్ కామినేని నిర్మించిన చిత్రం 'లచ్చిందేవికి ఓ లెక్కుంది'. ఈ చిత్రానికి సంగీతం ఎమ్. ఎమ్. కీరవాణి. ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ 2016 కానుకగా జనవరి 1న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు జగదీశ్ తలశిల మాట్లాడుతూ....''అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలతో 'లచ్చిందేవికి ఓ లెక్కుంది' రూపుదిద్దుకుంది. అల్రెడీ ఎస్.ఎస్. రాజమౌళిగారి చేతుల మీదుగా విడుదల అయిన ఆడియోకి శ్రోతల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఎమ్. ఎమ్. కీరవాణిగారు అందించిన సంగీతం ఈ చిత్రానికి హైలైట్ కానుంది. ఉత్కంఠ భరితంగా అన్ని కమర్షియల్ అంశాలతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. న్యూ ఇయర్ 2016 కానుకగా..జనవరి 1వ తేదీన చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాము...'' అన్నారు.
నవీన్చంద్ర, లావణ్య త్రిపాఠి, జయప్రకాష్రెడ్డి, బ్రహ్మాజీ, అజయ్, నర్రా శీను తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: ఎమ్.ఎమ్. కీరవాణి, పాటలు: శివశక్తిదత్తా, అనంతశ్రీరాం, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరావు, డిఓపి: ఈశ్వర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఈ. మధుసూదన్రావు, నిర్మాత: సాయిప్రసాద్ కామినేని, రచన-దర్శకత్వం: జగదీశ్ తలశిల.