Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
ఆడపాండవులు!?
సమాజంలో స్త్రీజాతికి జరుగుతున్న అన్యాయాలకు, ఆకృత్యాలకు ఐదుగురు అమ్మాయిలు పడిన ఆవేదన, ఆ తర్వాత పరిణాలు నేపథ్యంగా రూపొందుతున్న 'ఆడపాండవులు' చిత్రం షూటింగ్ శుక్రవారం ఉదయం సారధి స్టూడియోలో మొదలైంది. నిర్మాత నల్లాని వెంకటరమణ నిర్మాణంలో శ్రీలక్ష్మీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. వెంకటేష్ కే.ఆర్. దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో కవిత, శ్రీనివాసవర్మ, జీవా, అలీ, సుమన్శెట్టి, గౌతంరాజు, జూ.రేలంగి, కొండవలస, జీవి, రంగనాథ్, తెలంగాణ శకుంతల, అన్నపూర్ణ, రజిత తదితరులు నటిస్తున్నారు.
ఈ చిత్రం ముహూర్తపు సన్నివేశానికి మాడగుల నాగఫణిశర్మ క్లాప్ ఇచ్చారు. గోగిరెడ్డి శ్రీనివాస్ కెమెరా స్విచాన్ చేశారు. 'ఐదుగురు అమ్మాయిల ఆవేదన, ఆ ఆవేదనలోంచి వారికి ఎలాంటి ఆలోచన పుట్టింది. పర్వవసానంగా తమ జాతికి గౌరవం తెచ్చేలా వారేమి చేశారు అనే అంశాలు నేపథ్యంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు' దర్శకుడు వెంకటేశ్ చెప్పారు.నిర్మాత నల్లాని వెంకటరమణ మాట్లాడుతూ 'సింగిల్ షెడ్యూల్లో నిర్మాణం పూర్తిచేస్తామ'న్నారు. 'ఇది చిన్న చిత్రమైనప్పటికీ సందేశంతో పాటుగా వాణిజ్య అంశాలు ఉన్నాయి' అని నటి కవిత పేర్కొంది.