twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘గుండెల్లో గోదారి’ ఆడియో 17న

    By Bojja Kumar
    |

    Gundello Godari
    మంచు లక్ష్మీప్రసన్న మంచు ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నిర్మించిన చిత్రం 'గుండెల్లో గోదారి'. ఈ చిత్రం ఆడియో అక్టోబర్ 17న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈచిత్రం పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఆది పనిశెట్టి, తాప్సీ, మంచు లక్ష్మి, సుదీప్ కిషన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

    ఈ చిత్రం రీ రికార్డింగ్ పనులు ఇటీవల చెన్నయ్ లో జరుగుతుండగా అక్కడికి వచ్చిన తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ సినిమా టీంకు అభినందనలు తెలియజేశారు. తమ సినిమాకు అంతటి పెద్ద స్టార్ అభినందనలు తెలియజేయడం ఆనందంగా ఉందని, మంచి కథను ఎంచుకున్నారని రజనీ అంకుల్ మెచ్చుకున్నారని వివరించారు.

    ఈ చిత్రం తమిళంలో కూడా విడుదల కానుంది. 1986లో వచ్చిన వదరలు, ప్రేమకథను మిళితం చేసిన కథతో ఈ సినిమా రూపొందుతోంది. చిత్రంలో ప్రతి ఒక్కరు కొత్తగా కనిపించనున్నారు. ముమైత్ ఖాన్ ఐటం సాంగు చేస్తోంది. ఈ చిత్రం తమిళంలో కూడా విడుదల కానుంది. చిత్రంలో ప్రతి ఒక్కరు కొత్తగా కనిపించనున్నారు.

    కథా వస్తువు మత్స్యకారుల జీవితాలకి సంబంధించినది కావడం వల్ల, పశ్చిమ గోదావరి జిల్లా తీర ప్రాంతంలోని 27 ఎకరాలలో 120 గుడిసెలతో కూడిన పల్లె సెట్ ను వేశారు. చిత్రం చాలా వరకు పాలకొల్లు,అమలాపురం మరియు గోదారి జిల్లాల పరిసరాలలో తెరకెక్కించారు. ఇళయరాజా సంగీతం అందించారు. ఈ చిత్రానికి సమర్పణ:మోహన్‌బాబు.ఎం. నిర్మాత:మంచు లక్ష్మీ ప్రసన్న, దర్శకత్వం:కుమార్ నాగేంద్ర.

    English summary
    
 The audio songs of Gundello Godari will be released on October 17 in Hyderabad. The film, which is currently wrapping up the post production works, will be released simultaneously in Telugu and Tamil versions.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X