'గంధర్వ మహల్' గురించి మంచు లక్ష్మి గొప్పలు
మంచు లక్ష్మి ప్రసన్న నిర్మిస్తున్న ఊ కొడతారా..ఉలిక్కి పడతారా చిత్రం కోసం వేసిన గంధర్వ మహల్ గురించి కొంచెం ఎక్కువ పబ్లిసిటీనే చేస్తోంది.ఆమె ఈ సెట్ గురించి చెబుతూ.. ఓ మాసివ్ సెట్ ని ఆర్ట్ డైరక్టర్ భూపేష్ ఆర్ భూపతి కళా దర్శకత్వంలో రూపొందించాము. అది చూస్తుంటే నే చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది. మా సోదరుడు మంచు మనోజ్ చేస్తున్న ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుంది అంటూ చెప్పుకొచ్చింది.ఈ మాటలు వింటున్న వారికి ఆమె గతంలో అనగనగా ఒక ధీరుడు చిత్రం షూటింగ్ సమయంలో చెప్పిన మాటలు,కబుర్లు గుర్తుకు వస్తున్నాయంటున్నారు.ఇక ఈ చిత్రంలో నందమూరి బాలకృష్ణ ఓ ప్రత్యేకమైన పాత్రలో కనిపించనున్నారు.
అప్పట్లో బాలయ్య చేసిన ఆదిత్యా 369 లో శ్రీకృష్ణ దేవరాయులుగా తరహాలో మహారాజుగా కనిపించనున్నారని సమాచారం. మంచు ఎంటర్టైన్మెంట్ పతాకంపై మంచు లక్ష్మీ ప్రసన్న నిర్మించే చిత్రం 'ఊ... కొడతారా..!? ఉలిక్కిపడతారా..!?' చిత్రం కోసం బాలయ్య ఈ అవతారమెత్తనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం ద్వారా శేఖర్ రాజా దర్శకుడుగా పరిచయం అవుతున్నారు. ఇక ఈ పాత్ర దాదాపు ముఫ్పై నిముషాల పాటు ఉంటుంది. అలాగే ఈ చిత్రంలో లక్ష్మి ప్రసన్న కూడా ఓ కీలకమైన పాత్రను పోషించనుంది. ఈ చిత్రంలో దీక్షాసేధ్ హీరోయిన్ గా చేస్తోంది.


Click it and Unblock the Notifications











