Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
'గంధర్వ మహల్' గురించి మంచు లక్ష్మి గొప్పలు
మంచు లక్ష్మి ప్రసన్న నిర్మిస్తున్న ఊ కొడతారా..ఉలిక్కి పడతారా చిత్రం కోసం వేసిన గంధర్వ మహల్ గురించి కొంచెం ఎక్కువ పబ్లిసిటీనే చేస్తోంది.ఆమె ఈ సెట్ గురించి చెబుతూ.. ఓ మాసివ్ సెట్ ని ఆర్ట్ డైరక్టర్ భూపేష్ ఆర్ భూపతి కళా దర్శకత్వంలో రూపొందించాము. అది చూస్తుంటే నే చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది. మా సోదరుడు మంచు మనోజ్ చేస్తున్న ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుంది అంటూ చెప్పుకొచ్చింది.ఈ మాటలు వింటున్న వారికి ఆమె గతంలో అనగనగా ఒక ధీరుడు చిత్రం షూటింగ్ సమయంలో చెప్పిన మాటలు,కబుర్లు గుర్తుకు వస్తున్నాయంటున్నారు.ఇక ఈ చిత్రంలో నందమూరి బాలకృష్ణ ఓ ప్రత్యేకమైన పాత్రలో కనిపించనున్నారు.
అప్పట్లో బాలయ్య చేసిన ఆదిత్యా 369 లో శ్రీకృష్ణ దేవరాయులుగా తరహాలో మహారాజుగా కనిపించనున్నారని సమాచారం. మంచు ఎంటర్టైన్మెంట్ పతాకంపై మంచు లక్ష్మీ ప్రసన్న నిర్మించే చిత్రం 'ఊ... కొడతారా..!? ఉలిక్కిపడతారా..!?' చిత్రం కోసం బాలయ్య ఈ అవతారమెత్తనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం ద్వారా శేఖర్ రాజా దర్శకుడుగా పరిచయం అవుతున్నారు. ఇక ఈ పాత్ర దాదాపు ముఫ్పై నిముషాల పాటు ఉంటుంది. అలాగే ఈ చిత్రంలో లక్ష్మి ప్రసన్న కూడా ఓ కీలకమైన పాత్రను పోషించనుంది. ఈ చిత్రంలో దీక్షాసేధ్ హీరోయిన్ గా చేస్తోంది.