Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
జయసుధ ఓటమిపై మంచు లక్ష్మి స్పందన ఇలా..
హైదరాబాద్: ‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్' ఎన్నికల్లో రాజేంద్రప్రసాద్ చేతిలో జయసుధ ఓటమి పాలైన నేపథ్యంలో.....ముందు నుండీ జయసుధకు మద్దతుగా ఉంటూ వస్తున్న మంచు లక్ష్మి ప్రసన్న తనదైన రీతిలో స్పందించారు. ‘మా' ఎన్నికల చరిత్రలో తొలిసారిగా ఒక మహిళ పోటీ చేస్తున్నందుకే ఆమెకు మద్దతు ఇచ్చామని తెలిపారు. గెలుపొందిన రాజేంద్రప్రసాద్ కు అభినందనలు తెలిపారు.
తనను మా ఉపాధ్యక్ష పదవికి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం మంచు లక్ష్మి ఆనందం వ్యక్తం చేసారు. సినీ ఆర్టిస్టులు, సినీ కార్మికుల సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానని మంచు లక్ష్మి చెప్పుకొచ్చారు. మా ఉపాధ్యక్షురాలిగా తన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తిస్తానని మంచు లక్ష్మి చెప్పుకొచ్చారు.
ఎన్నికల్లో విజయం సాధించిన రాజేంద్రప్రసాద్ కు అభినందనలు తెలిపారు జయసుధ. రాజేంద్రప్రసాద్ మాదిరి తాను ప్రచారం చేయలేక పోయానని, అయినప్పటికీ తాను 150 ఓట్లు సాధించానని జయసుధ చెప్పుకొచ్చారు.
తన గురించి మాట్లాడేటపుడు రాజేంద్రప్రసాద్ ఇంకా కామెడీ చేష్టలు చేస్తున్నాడని, అలా చేయడం ద్వారా గౌరవం కోల్పోయాడని జయసుధ విమర్శించారు. ఎవరూ గెలిచినా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అభ్యున్నతికి తోడ్పడాలన్నదే తన కోరిక అని జయసుధ చెప్పుకొచ్చారు.
మా
ఎన్నికల్లో
మొత్తం
702
ఓట్లకుగాను,
394
ఓట్లు
పోలయ్యాయి.
అధ్యక్షుడు:
గద్దె
రాజేంద్రప్రసాద్...
85
ఓట్లతో
ఆధిక్యం
విజయం
ఉపాధ్యక్షులు:
మంచు
లక్ష్మి
(ఏకగ్రీవం)
కార్య
నిర్వాహక
కార్యదర్శి
:
తనికెళ్ల
భరిణి...165
ఓట్లతో
విజయం(జయసుధ
ప్యానెల్)
ప్రధాన
కార్యదర్శి:
శివాజీ
రాజా...
36
ఓట్ల
ఆధిక్యంతో
విజయం
(రాజేంద్రప్రసాద్
ప్యానెల్)
కోశాధికారి
:
పరుచూరి
వెంకటేశ్వరరావు...
159
ఓట్లతో
విజయం
(జయసుధ
ప్యానెల్)
జాయింట్
సెక్రటరీలు:
నరేష్,
రఘుబాబు
(జయసుధ
ప్యానెల్)
ఎగ్జిక్యూటివ్
కమిటీ:
బెనర్జీ,
బ్రహ్మాజీ,
చార్మి,
రాజేశ్వర్,
ఏడిద
శ్రీరామ్,
గీతాంజలి,
హరినాథ్
బాబు,
హేమ,
జాకీ,
జయలక్ష్మి,
కాదంబరి
కిరణ్,
నర్సింగ్
యాదవ్,
రాజీవ్
కనకాల,
శ్రీ
శశాంక,
విద్యాసాగర్
తదితరులు