Don't Miss!
- Sports చరిత్ర సృష్టించిన KL రాహుల్.. ధోనీ రికార్డు బ్రేక్
- News ఏపీలో తీవ్ర వడగాల్పులు: అప్రమత్తంగా ఉండక తప్పదు
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
మంచు లక్ష్మీ ‘లక్ ఉంటే లక్ష్మీ’
మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి ప్రసన్న తొలుత టీవీ షోల ద్వారా ప్రేక్షకులకు పరిచయం అయిన సంగతి తెలిసిందే. 'లక్ష్మి టాక్ షో', 'ప్రేమతో మీ లక్ష్మి' కార్యక్రమాల ద్వారా పాపులర్ అయిన ఈ భామ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం నిర్మాతగా పలు సినిమాలను నిర్మిస్తోంది.
ఆమె మంచు ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్పై రూపొందించిన 'ఊ కొడతారా ఉలక్కి పడతారా' చిత్రం ఇటీవలే విడుదలైంది. మరో వైపు 'గుండెల్లో గోదారి' చిత్రంలో నటించడంతో పాటు ఈ సినిమాకు నిర్మాతగా కూడా వ్యవహరిస్తోంది. తాజాగా లక్ష్మి మరో టీవీ షోను లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది.
లక్ ఉంటే లక్ష్మి' పేరుతో ప్రసారం కానున్న ఈ షోలో పాల్గొనే వారు లక్కు ఉంటే డబ్బు, బహుమతులు గెలుచుకోవచ్చు అనే కాన్సెప్టుతో రూపొందిస్తున్నారు. ఈ కార్యక్రమానికి సాయి కుమార్ వ్యాఖ్యానం వహిస్తున్నారు. ఈ విషయమై మంచు లక్ష్మి తన ట్విట్టర్లో పేర్కొంటూ..''లక్ ఉంటె లక్ష్మి లో నేను కనపడబోతున్నాను, చాలా రోజుల తరువాత బుల్లి తెర మీదకి రానున్నాను. ప్రతి శుక్రవారం ఈ కార్యక్రమం ప్రసారం అవ్వనుంది" అని వెల్లడించారు.