Don't Miss!
- News రెండో రోజు నామినేషన్ల జోరు: 69 నామినేషన్లు వేసిన 57 మంది అభ్యర్థులు, ప్రముఖులు వీరే
- Sports ధోనీ ట్రేడ్మార్క్ సిక్సర్..101 మీటర్ల దూరం Video
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
సెక్సీ పోస్టర్పై మంచు లక్ష్మి అభ్యంతరం
ఫ్యాషన్ డిజైనర్ పోస్టర్ అభ్యంతర కరంగా ఉందంటూ నటి మంచు లక్ష్మి ట్విట్టర్ ద్వారా అసంతృప్తి వ్యక్తం చేసారు.
హైదరాబాద్: వంశీ దర్శకత్వంలో దాదాపు 30 ఏళ్ల క్రితం వచ్చిన 'లేడీస్ టైలర్' తెలుగు సినిమా చరిత్రలో ఎప్పటికీ గుర్తుండి పోయే సినిమాగా నిలిచి పోయింది. అప్పటి పరిస్థితులను ఫోకస్ చేస్తూ ఆ సినిమా ఉంటే... ఇప్పటి లేటెస్ట్ ట్రెండుకు తగిన విధంగా 'ఫ్యాషన్ డిజైనర్' పేరుతో తాజాగా ఓ సినిమా మొదలు పెట్టారు వంశీ. సన్ ఆఫ్ లేడీస్ టైలర్ అనేది సబ్ కాప్షన్.
మంచు లక్ష్మి అభ్యంతరం
తాజాగా ఫ్యాషన్ డిజైనర్ చిత్రానికి సంబంధించిన ప్రీ లుక్ రిలీజైంది. అయితే ఈ పోస్టర్ అభ్యంతర కరంగా ఉందంటూ నటి మంచు లక్ష్మి ట్విట్టర్ ద్వారా అసంతృప్తి వ్యక్తం చేసారు. మరి మంచు లక్ష్మి లేవనెత్తిన అంశంపై చిత్ర దర్శక నిర్మాతలు ఎలా స్పందిస్తారో?
|
లేడీస్ టైలర్ సీక్వెల్
సినిమా వివరాల్లోకి వెళితే... సుమంత్ అశ్విన్ హీరోగా ఫ్యాషన్ డిజైనర్ తెరకెక్కిస్తున్న వంశీ ఈ చిత్రంలో లేడీస్ టైలర్ హీరో రాజేంద్ర ప్రసాద్ తో కూడా ఓ ముఖ్య పాత్ర చేయించినట్టు తెలుస్తుంది.
సుమంత్ అశ్విన్
ఈ చిత్రాన్ని మాస్ మహారాజ్ రవితేజతో లేదంటే యంగ్ హీరో రాజ్ తరుణ్ తో చేయాలని వంశీ భావించాడు. కాని ఫైనల్ గా సుమంత్ అశ్విన్ హీరోగా లేడీస్ టైలర్ సీక్వెల్ తెరకెక్కించారు. కొన్ని నెలుగా జరుగుతున్న ఈ చిత్ర షూటింగ్ కోనసీమ పరిసర ప్రాంతాల్లోని అద్భుతమైన లొకేషన్లలో చిత్రీకరించడం జరిగింది.
మధుర శ్రీధర్
రీసెంట్ గా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకొని వీలైనంత త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. మధుర శ్రీధర్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో అనీషా అంబ్రోస్, ఈషా, మానస కథానాయికలుగా కనిపించనున్నారు.