Don't Miss!
- News Arvind Kejriwal..జైల్లో కేజ్రీవాల్ తిన్నది మూడు మామిడిపండ్లే: ఈడీ చీప్ అభియోగాలు
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Sports SRH playing XI: అతనిపై వేటు..ఢిల్లీతో ఆడే తుదిజట్టు ఇదే
- Lifestyle ఎండాకాలంలో ఈ ఫుడ్స్కు దూరంగా ఉండాలి.. లేదంటే డీహైడ్రేషన్ తప్పదు..
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
‘మేమంతా ముస్లింలమే’ అంటున్న మంచు లక్ష్మి
హైదరాబాద్: తెలుగు సినిమా పరిశ్రమలో సంచలనాలకు కేంద్ర బిందువుగా ఉండే వారిలో నటి మంచు లక్ష్మి ఒకరు. తాజాగా ఆమె తన సోషల్ నెట్వర్కింగ్ సైట్లో పోస్టు చేసిన ఫోటో ఒకటి హాట్ టాపిక్ అయింది. ‘మేమంతా ముస్లింలమే' అంటూ మంచు లక్ష్మి ప్లకార్డు ప్రదర్శించడం చర్చనీయాంశం అయింది. ‘స్టాండప్ ఫర్ హ్యుమానిటీ, హ్యూమానిటీ లవ్, ఫ్యూచర్ అనే ట్యాగ్స్ తగిలించి మంచే లక్ష్మి ఈ ఫోటో పోస్టు చేసారు.
ప్రపంచ వ్యాప్తంగా టెర్రరిస్టు కార్యకలాపాల్లో ముస్లిం వర్గానికి చెందిన వారే ఎక్కువగా ఉండటం వల్ల వారిపై ఎక్కడికెళ్లిన ఓ వివక్ష కొనసాగుతోంది. ఇటీవల ఫ్రాన్స్ లో దాడి తర్వాత యూరఫ్, అమెరికాల్లో ఈ దోరణి మరింత ఎక్కువైంది. ఈ నేపథ్యంలో మంచి వారైన ముస్లిం ప్రజలకు తమ మద్దతు పలకడంలో భాగంగా పలువురు సెలబ్రిటీలు ఇలాంటి ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు.
అందులో భాగంగానే మంచు లక్ష్మి ఈ పోస్టర్ ప్రదర్శించారు. కొందరు టెర్రరిస్టులు చేసే పనుల వల్ల మిగిలిన ముస్లింలపై వివక్ష చూపడం సరికాదు అనే సందేశం ఇవ్వడానికే మంచు లక్ష్మి ఇలా చేసారని అంటున్నారు.