Don't Miss!
- Sports SRH vs RCB: ఫుల్ టాస్కు ఔటైన మార్క్రమ్.. నవ్వు ఆపుకోలేకపోయిన కోహ్లీ!వీడియో
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- News కాలేజ్ అమ్మాయి ఇంటికి వెళ్లిన సీఎం, పోలింగ్ కు ఒక్కరోజు ముందు ప్రతిపక్షాలకు ఝలక్!
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మా పెళ్లి అయ్యాక జూ. ఎన్టీఆర్ వాళ్ళ అమ్మతో వచ్చాడు.. నేనే పిలిపించా.. లక్ష్మీ పార్వతి!
నందమూరి కుటుంబానికి లక్ష్మి పార్వతి ఎప్పుడూ దూరంగానే ఉంటున్నారు. పలు సందర్భాల్లో లక్ష్మీపార్వతి నందమూరి కుటుంబాన్ని విమర్శిస్తుండడం చూస్తూనే ఉన్నాం. పలు సందర్భంలో ఎన్టీఆర్ చివరి రోజుల్లో జరిగిన సంఘటనలని లక్ష్మీ పార్వతి మీడియాకు వివరించారు. తాజాగా ఓ యూట్యూబ్ చానల్ కు లక్ష్మి పార్వతి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో ఆమె చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్ గురించి లక్ష్మి పార్వతి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతానికి ఆ ఇంటర్వ్యూ ప్రోమో మాత్రమే విడుదల చేశారు.
మా పెళ్లి అయ్యాక నేనే పిలిపించా
జూనియర్ ఎన్టీఆర్ తొలిసారి తన తాత ఎన్టీఆర్ గారిని కలుసుకున్న సందర్భంలో మీరు అక్కడే ఉన్నారు కదా అనే ప్రశ్నకు లక్ష్మి పార్వతి ఆసక్తికర సమాధానం ఇచ్చారు. అసలు జూ. ఎన్టీఆర్ ని పిలిపించిందే నేను అని అన్నారు. మా పెళ్లి అయ్యాక నేనే జూ.ఎన్టీఆర్ ని, వాళ్ళ అమ్మని ఇంటికి పిలిచా అని తెలిపారు.
అనేక ఊహాగానాలు
ఈ ఇంటర్వ్యూలో లక్ష్మి పార్వతి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేశారు. వాడు తక్కువేం కాదు.. నా ఫోటో చించి పడేశాడు అని తెలిపింది. ఇది ప్రోమో మాత్రమీ కాబట్టి లక్ష్మి పార్వతి ఆ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేశారో తెలియాలంటే పూర్తి ఇంటర్వ్యూ వరకు ఆగాల్సిదే. జూనియర్ ఎన్టీఆర్, లక్ష్మి పార్వతికి సంబందించిన సన్నివేశాలు వర్మ తెరక్కించే లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో ఉంటాయని ఆసక్తికర ప్రచారం జరుగుతోంది.
అందరి గురించి ఆలోచిస్తుంటావు
ఎన్టీఆర్, తనకు మధ్య అనురాగాన్ని లక్ష్మి పార్వతి వివరించారు. నేను ఎప్పుడైనా అనారోగ్యంతో ఉంటే సుతిమెత్తగా మందలించేవారు. అందరి గురించి ఆలోచిస్తుంటావు నీ గురించి నువ్వు జాగ్రత్త తీసుకోవా అని అడిగేవారని లక్ష్మి పార్వతి తెలిపింది. ఈ ఇంటర్వ్యూలో అనేక రాజకీయ అంశాల గురించి కూడా లక్ష్మి పార్వతి తన అభిప్రాయాన్ని తెలియజేశారు.
లక్ష్మీస్ ఎన్టీఆర్లో
రాంగోపాల్ వర్మ చిత్రాలంటే వివాదాలతోనే ప్రచారం పొందుతాయి. అలాగే లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో కూడా ప్రేక్షకుల్లో ఉత్కంఠ పెంచే ప్రతి అంశాన్ని వర్మ టచ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. దీని కోసం వర్మ లక్ష్మి పార్వతి నుంచి అన్ని వివరాలు సేకరిస్తున్నారట. జూ.ఎన్టీఆర్ తన తాతని కలుసుకునే సన్నివేశం తప్పనిసరిగా ఉండాలని వర్మ పట్టుబడుతున్నాడట.