Don't Miss!
- News అమిత్ షా ఓ గూండా, రౌడీ, అయినా పక్కనే పెట్టుకున్న ప్రధాని మోదీ, సీఎం కొడుకు సంచలనం!
- Sports RR vs DC: చరిత్ర సృష్టించిన రిషభ్ పంత్.. ఒకే ఒక్కడిగా..!
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ చూసి కంటతడి పెట్టుకున్న లక్ష్మీపార్వతి.. హరికృష్ణ ఒప్పుకోలేదు!
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ అన్నంతపనీ చేశారు. లక్ష్మీఎన్టీఆర్ చిత్రపై ఇప్పటివరకు మాటలు చెబుతూ వచ్చిన వర్మ తాజాగా ట్రైలర్ విడుదల చేసి సంచలనం సృష్టించారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ ప్రస్తుతం యూట్యూబ్ లో దూసుకుపోతోంది. అద్భుతమైన డ్రామా, సరైన భావోద్వేగాలతో ఎన్టీఆర్, లక్ష్మీ పార్వతి మధ్య జరిగిన సంఘటనలని తాను కళ్ళకు కట్టునట్లు చూపించబోతున్నానని వర్మ ఈ ట్రైలర్ ద్వారా తెలిపాడు. లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ విడుదల కాగానే లక్ష్మీపార్వతి తన స్పందన తెలియజేశారు.
లక్ష్మీ పార్వతి కంటతడి
ఈ ఉదయమే దర్శకుడు రాంగోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ ని విడుదల చేశారు. ఓ టివి చర్చా కార్యక్రమంలో లక్ష్మీపార్వతి ఈ ట్రైలర్ ని చూశారు. ట్రైలర్ చూడగానే ఆమె భావోద్వేగానికి గురవుతూ కంటతడి పెట్టుకున్నారు. ట్రైలర్ పై మీ స్పందన ఏంటని అడగగా నా కన్నీళ్లే స్పందన అని లక్ష్మీపార్వతి తెలిపారు. ఈ చిత్రంలో ప్రతి సన్నివేశాన్ని వర్మ వాస్తవంగా తెరక్కించారని లక్ష్మి పార్వతి తెలిపారు.
ప్రతి మాట గుర్తుంది
నా జీవితంలో జరిగిన సంఘటనలన్నీ ఈ ట్రైలర్ లో కనిపిస్తున్నాయి అని లక్ష్మీపార్వతి తెలిపారు. నాకు ప్రతి మాట, ప్రతి చర్య గుర్తుంది. 23 ఏళ్ళు గడచినా అవన్నీ గుర్తుపెట్టుకున్నాను కాబట్టి నిలబడగలిగాను అని లక్ష్మీపార్వతి అన్నారు. ఈ చిత్రాన్ని వాస్తవంగా తెరకెక్కించినందుకు వర్మకు కృతజ్ఞతలు తెలపాలి అని లక్ష్మీపార్వతి అన్నారు. నన్ను ఒక్క విషయం కూడా అడగకుండానే వర్మ అని విషయాలని తెలుసుకున్నారు అని ఆమె తెలిపారు.
వంట మనుషులతో సహా
ఈ చిత్రం విషయంలో లక్ష్మీపార్వతి గారిని నేను ఏమీ అడగను అని తిరుపతిలో వర్మ అన్నట్లు ఆమె తెలిపింది. నేను ఎన్టీఆర్ కు మహా భక్తుడిని. ఈ చిత్రం కోసం వర్మ ఎంతో మందిని సంప్రదించారు. ఎన్టీఆర్ వద్ద పనిచేసిన అధికారులు, ఇంట్లో వంటవాళ్లు, పనిమనుషులని కూడా వర్మ సంప్రదించారు అని లక్ష్మీపార్వతి తెలిపారు. అన్ని విషయాలని తెలుసుకున్న తర్వాత వర్మ ఈ కథని సిద్ధం చేసుకున్నారని లక్ష్మీపార్వతి తెలిపింది. ఈ చిత్రంలో నా ప్రమేయం లేదని అన్నారు.
ఫ్యామిలీతో మీటింగ్
తన పెళ్లి విషయంలో ఎన్టీఆర్ స్వయంగా తన కుటుంబ సభ్యులతో రెండు సార్లు మీటింగ్ పెట్టారని లక్ష్మి పార్వతి తెలిపారు. ఆయన కొడుకులు హరికృష్ణ ఒప్పుకోలేదు. కుమార్తెలు కూడా ఒప్పుకోలేదు. ఆయన కుమార్తెలు ఇప్పటికి నాతో మాట్లాడరని లక్ష్మీపార్వతి తెలిపారు. నా పెళ్లి వలన మీకు ఎలాంటి ఇబ్బంది కలగదని ఎన్టీఆర్ చెప్పినా ఆయన కుటుంబ సభ్యులు వినిపించుకోలేదని అన్నారు. వర్మ ఇన్ని వాస్తవాలని ఎలా బయటకు తీశారో నాకు ఇప్పటికే ఆశ్చర్యంగా ఉందని లక్ష్మీపార్వతి తెలిపారు.