Don't Miss!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- News బాలకృష్ణకు షాక్: హిందూపురంలో నామినేషన్ వేసిన స్వామి పరిపూర్ణానంద
- Sports CSK vs LSG: శతక్కొట్టిన రుతురాజ్ గైక్వాడ్.. చితక్కొట్టిన శివమ్ దూబే!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
ఉమామహేశ్వరి మరణం మిస్టరీనే.. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ల పేర్లు ప్రస్తావిస్తూ లక్ష్మీ పార్వతి సంచలన ఆరోపణలు!
ఇటీవల నందమూరి ఫ్యామిలీలో తీవ్ర విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. సీనియర్ ఎన్టీఆర్ చిన్న కూతురు ఉమామహేశ్వరి ఆత్మహత్య చేసుకుని మరణించారు. తాజాగా ఈ విషయం మీద ఎన్టీఆర్ రెండో భార్య, నందమూరి లక్ష్మీపార్వతి స్పందించారు. ఆ వివరాల్లోకి వెళితే
విషాదఛాయలు
సీనియర్ ఎన్టీఆర్ చిన్న కూతురు ఉమామహేశ్వరి మృతి చెందడంతో నందమూరి ఫ్యామిలీలో ఒక్కసారిగా విషాదఛాయలు అలముకున్నాయి. ఉమామహేశ్వరి ఆరోగ్య సమస్యల వలన అలాగే ఒత్తిడి వలన బాధను తట్టుకోలేక ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు. ఇక ఈ మృతిపై పోలీసులు కేసు కూడా నమోదు చేసుకున్నారు. సినిమా ఇండస్ట్రీలో ఎంతో పెద్దదైన నందమూరి ఫ్యామిలీలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది.
గుండెపోటుతో
ఈ క్రమంలో లక్ష్మీ పార్వతి మాట్లాడుతూ ఎన్టీఆర్ కుటుంబంలో జరుగుతున్న సంఘటనలు చాలా బాధగా కలిగించాయని అన్నారు. ఉమామహేశ్వరి మృతికి నా ప్రగాఢ సానుభూతి అని పేర్కొన్న లక్ష్మీ పార్వతి ఏమీ జరిగిందనేది మిస్టరీగానే ఉందని, చంద్రబాబు నీచ రాజకీయాలు తెలిసిన వారు ఈ విషయంలో అనుమానించక తప్పదని అన్నారు. అసలు ఆ కుటుంబానికి చంద్రబాబు ఒక శనిలా పట్టుకున్నాడన్న ఆమె సింహగర్జనకు సిద్దమవుతున్న ఎన్టీఆర్ చంద్రబాబు చర్యల వల్ల గుండెపోటుతో మరణించారని వెల్లడించారు.
మరణం కూడా మిస్టరీ గా
ఆయన బ్యాంక్ అకౌంట్లు కూడా సీజ్ చేసి అధ్యక్ష పదవి కూడా లాక్కున్నారని, తనను బూచిగా చూపి కుటుంబాన్ని నమ్మించారని అన్నారు. హరికృష్ణకు మంత్రి పదవి ఇచి 6 నెలల్లోనే లాగేసుకున్నాడని, మానసికంగా హరికృష్ణను ఎన్నో ఇబ్బందులు పడ్డారని అన్నారు. అందుకే ఈ రోజుకీ కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబుతో మాట్లాడరన్న ఆమె ఈమె మరణం కూడా మిస్టరీ గా మారింది...సోషల్ మీడియాలో అనేక పోస్టులు వస్తున్నాయని అన్నారు.
లేఖ మాయం
అందులో కొన్ని నమ్మేవి...నమ్మనివి ఉండొచ్చు కానీ పోలీసులు ఒక లేఖ రాసి ఉండొచ్చు అన్నారు, అయితే చంద్రబాబు రంగప్రవేశం చేశాక ఆ లేఖ మాయం అయింది అంటున్నారని అన్నారు. కోడెల శివ ప్రసాద్ మరణంలో కూడా ఇదే జరిగింది...ఆయన ఫోన్ రికార్డులో కూడా చంద్రబాబు గురించే ఉందని అన్నారు. అందుకే ఆయన ఫోన్ ఇప్పటికీ ఆచూకీ లేదని అనుమానం వ్యక్తం చేశారు. చంద్రబాబు తండ్రి పేరు చెప్పకుండా ఎన్టీఆర్ ని చంపి ఆయన పేరే చెప్పుకుంటున్నారని ఆమె అన్నారు.
తప్పుకోమని
అలాంటి ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలేమిటి అనేది తేల్చాలని లక్ష్మీ పార్వతి అన్నారు. అస్తి వివాదాల్లో ఆమె ఆత్మహత్య చేసుకుందని నా అనుమానం అని, నారా లోకేష్ ను అందలం ఎక్కించడానికి నువ్వు ఏదైనా చేస్తావని ఆమె చంద్రబాబుని టార్గెట్ చేశారు. ఒకవేళ నువ్వు కారణం కాకపోతే వారి సమస్య ఏమిటో కుటుంబ పెద్దగా పరిష్కరించ లేవా అని ప్రశ్నించారు.
ఆమె సూసైడ్ నోట్ నువ్వు దొంగిలించావ్ అని ప్రచారం జరుగుతుందని, ఇప్పటికైనా పార్టీని బాలకృష్ణకు అప్పజెప్పి పక్కకు తప్పుకోమని సలహా ఇచ్చారు. దీంట్లో ఏమీ లేదంటే నువ్వే వెంటనే సీబీఐ విచారణకు లేఖలు రాయాలని, నీకు రాయటం చేతకాకపోతే నేనే సీబీఐకి లేఖ రాస్తానని ఆమె అన్నారు. సీబీఐ క్లీన్ చిట్ ఇస్తేనే తప్ప నిన్ను నమ్మలేమని ఆమె పేర్కొన్నారు.