Don't Miss!
- News YS Jagan Stone Attack: జగన్ పై దాడి కేసు విచారణ-ఈసీ జోక్యం కోరిన టీడీపీ..!
- Sports ఆర్సీబీ తుది జట్టు అంచనా
- Finance Tata Sons IPO: టాటా సన్స్ ఐపీఓ వస్తుందా.. రాదా..!
- Technology 6.9 అంగుళాల డిస్ప్లే, 64MP కెమెరా ఫోల్డబుల్ ఫోన్పై భారీ డిస్కౌంట్.. అమెజాన్ సేల్ పూర్తి వివరాలు..!
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Automobiles హ్యుందాయ్ ఎక్స్టర్ దిమ్మ తిరిగే మైలేజ్.. ఓనర్ ఫుల్ ఖుష్.. ఫొటోలతో సహా ప్రూఫ్ ఇదిగో.!!
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
హాట్ లక్ష్మీరాయ్...గ్యాంగ్రేప్ బాధితురాలు ?
ఈ పాత్ర విషయంలో ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నట్లు వేణు తెలిపాడు. సమాజంలో స్త్రీలు ఎదుర్కొంటున్న దారుణ సంఘటనలపై జనంలో చైతన్యం కలిగించడానికి ఈ సినిమా ఉపకరిస్తుందని ఆయన భావిస్తున్నాడు. నాలుగు దక్షిణాది భాషల్లో ఈ చిత్రాన్ని రూపొందించాలనేది వేణు సంకల్పం అని తెలుస్తోంది.
మరో ప్రక్క ఈ ఘటనపై ఛార్మి ప్రధాన పాత్రలో తెలుగు సినిమా రాబోతోంది. గతంలో కొమురంభీం జీవితంపై సినిమాను, గౌతమ బుధ్దుడిపై చరిత్రాత్మక చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు అల్లాని శ్రీధర్ ఈచిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రంలో అల్లాని శ్రీధర్ హీరోయిన్ ఛార్మిని ఈ వివాదాస్పద సినిమాలో లీడ్ రోల్ హీరోయిన్ గా తీసుకునేందుకు ప్లాన్ చేస్తున్నాడు.
గ్యాంగ్ రేప్ లో తీవ్ర గాయాల పాలైన యువతి ప్రాణాలతో పోరాడి చివరకు తుది శ్వాస విడిచింది. ఈ దారుణ ఘటన దేశం మొత్తాన్ని కదిలించింది. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పార్లమెంటు ముట్టడికి దారి తీసింది. ఓ ప్రముఖ ఆంగ్ల పత్రికతో అల్లాని శ్రీధర్ మాట్లాడుతూ... ఢిల్లీ గ్యాంగ్ రేప్ ఘటనపై సినిమా తీయబోతున్నట్లు స్పష్టం చేసారు. ప్రస్తుతం తన టీం స్క్రిప్టు వర్కులో బీజీగా ఉన్నట్లు వెల్లడించారు. అదే విధంగా ఈ సినిమాలో ఛార్మిని హీరోయిన్ గా తీసుకుంటున్నట్లు వెల్లడించారు.