twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నెత్తిన చెత్త వేసుకున్నట్లే.. అంతకు మించి ఏమీ చేయలేరు, లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదలపై నిర్మాత!

    |

    దర్శకుడు రాంగోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మి పార్వతి ప్రవేశించిన తర్వాత జరిగిన ఎపిసోడ్ ని వర్మ ఈ చిత్రంలో చూపించబోతున్నాడు. ఎన్ని బెదిరింపులు ఎదురైనా లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని విడుదల చేసి తీరుతానని వర్మ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్జీవిపై అనేక రాజకీయ ఆరోపణలు వినిపిస్తున్నాయి. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం మార్చ్ 22న విడుదుల కావాల్సింది. కానీ 29కి వాయిదా పడింది. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్ర విడుదల గురించి మాట్లాడుతూ నిర్మాత రాకేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

     నెత్తిన చెత్త వేసుకున్నట్లే

    నెత్తిన చెత్త వేసుకున్నట్లే

    లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని అడ్డుకునేందుకు టిడిపి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలపై ఈ చిత్ర నిర్మాత రాకేష్ రెడ్డి స్పందించారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని మీరు ఎంతగా అడ్డుకోవాలని చూస్తే అంతగా అల్లరైపొయేది మీరే. మీ నెత్తిన మీరే చెత్త వేసుకున్నట్లు. అడ్డుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసిన లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదల తధ్యం అని రాకేష్ రెడ్డి అన్నారు. చాలా మంది టిడిపి నాయకులు నాతో మాట్లాడడానికి ప్రయత్నించారు. లీగల్ గా మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి. మేము ఎదుర్కొంటాం అని తెలిపారు.

     థియేటర్ వద్ద

    థియేటర్ వద్ద

    లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని వర్మ గారు సెన్సార్ రూల్స్ కి అనుగుణంగానే తెరకెక్కిస్తున్నారు. ఇది వాస్తవంగా జరిగిన కథ. ఇందులో ఎవరిని నెగిటివ్ గా చూపించడం లేదు. ఎన్టీఆర్ జీవితంలో ఎలాంటి సంఘటనలు జరిగాయి వాటినే వర్మ గారు చూపిస్తున్నారు. మహా అయితే కొన్ని థియేటర్స్ వద్ద ధర్నా పేరుతో ఒక షోని ఆపగలరేమో.. అంతకు మించి ఏమీ చేయలేరు అని రాకేష్ రెడ్డి తెలిపారు.

    కోర్టులో కేసులు

    కోర్టులో కేసులు

    ఇప్పటికే లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంపై కోర్టులో చాలా కేసుకు నమోదవుతున్నాయని రాకేష్ రెడ్డి తెలిపారు. కానీ మేము భయపడాల్సిన అవసరం లేదు నిజం మావైపు ఉంది అని రాకేష్ రెడ్డి తెలిపారు. ఆర్జీవీ తెరకెక్కిస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని ఎన్టీఆర్ అభిమానులంతా స్వాగతిస్తున్నారు. అందుకే ట్రైలర్స్ కి లక్షల్లో వ్యూస్ వస్తున్నాయని రాకేష్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఎన్టీఆర్ లాంటి మహానుభావుడి జీవితంలో ఎం జరిగిందనే నిజం అందరికి తెలియాలి అని అభిప్రాయపడ్డారు.

     బాహుబలి రేంజ్‌లో

    బాహుబలి రేంజ్‌లో

    లక్ష్మీస్ ఎన్టీఆర్ నిర్మాతగా నాకు దక్కిన ఈ గుర్తింపు మొత్తం ఎన్టీఆర్, రాంగోపాల్ వర్మ వల్లే అని అన్నారు. బాహుబలి నిర్మాతలకు కూడా ఇంత గుర్తింపు దక్కివుంటుందా అని అనిపిస్తోంది. ఎక్కడ విమానాశ్రయాల్లో చూసినా లక్ష్మిస్ ఎన్టీఆర్ నిర్మాత కదా మీరు అని అడుగుతున్నారు అని రాకేష్ రెడ్డి అన్నారు.

    English summary
    Lakshmi's NTR producer Rakesh Reddy reacts on movie release
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X