Don't Miss!
- News జగన్కు షాక్..పిఠాపురంలో వైసీపీకి భారీగా రాజీనామాలు
- Technology X ప్లాట్ఫాం ప్రీమియం ఫీచర్లను ఉచితంగా వినియోగించుకోవచ్చు.. వారికి మాత్రమేనని ఎలాన్ మస్క్ ప్రకటన!!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Sports రసెల్కు భయపడి ఆ బౌలర్పై వేటు..KKRతో ఆడే RCB తుది జట్టు ఇదే!
- Automobiles సమ్మర్లో కార్లలో వీటిని అస్సలు ఉంచొద్దు.. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
బ్రేకింగ్: ఆర్జీవికి ఝలక్.. 'లక్ష్మీస్ ఎన్టీఆర్' విడుదల ఆపేసిన ఆంధ్ర హైకోర్టు!
Recommended Video
దర్శకుడు రాంగోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర విడుదల కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్ర విడుదల విషయంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం మార్చ్ 22న విడుదుల కావాల్సింది. కానీ 29కి వాయిదా పడింది. ఎలాగైనా ఈ చిత్రాన్ని అడ్డుకునేందుకు తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ప్రయత్నించింది. ఎన్నికల సంఘం కూడా లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రానికి అడ్డు చెప్పలేదు. దీనితో మార్చి 29న లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం విడుదల ఖాయం అనుకుంటున్న సమయంలో దర్శకుడు అర్జీవికి పెద్ద ఝలక్. ఈ చిత్ర విడుదలని ఆపేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉత్తర్వులు జరీ చేసింది.
ఆర్జీవికి షాక్
ఎన్టీఆర్ జీవితంలోని అత్యంత వివాదాస్పద అంశాలతో రాంగోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుని నెగిటివ్ షేడ్స్ లో చూపిస్తుండడంతో టిడిపి నేతలు లక్ష్మిస్ ఎన్టీఆర్ చిత్ర విడుదల అడ్డుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. ఎట్టకేలకు వారి ప్రయత్నాలు ఫలించాయి. కనీసం ఎన్నికలు ముగిసేవరకు లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని వాయిదా వేయాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మంగళగిరిలో టీడీపీ నేతలు ఫిటిషన్ దాఖలు చేశారు.
రాజకీయ ఉద్దేశంతోనే
ఈ పిటిషన్ నేడు న్యాయస్థానం ముందు విచారణకు వచ్చింది. టిడిపి తరుపున న్యాయవాది బలంగా తన వాదనని వినిపించారు. రాంగోపాల్ వర్మ రాజకీయ ఉద్దేశంతోనే ఈ చిత్రాన్ని తెరకెక్కించారని, ఈ చిత్రం ప్రభావం ఎన్నికలపై ఉంటుందని ఆయనే సోషల్ మీడియాలో వ్యాఖ్యానించారని టిడిపి తరుపున న్యాయవాది వాదించారు. ఎప్పుడో జరిగిపోయిన సంఘటనలతో సినిమా తీసి ఎన్నికల ముందే విడుదల చేయడంలో ఆంతర్యం ఏమిటని న్యాయవాది ప్రశ్నించారు.
అప్పటి వరకు విడుదల వాయిదా
లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం త్వరలో జరగబోయే ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం ఉందనే వాదనలతో న్యాయస్థానం ఏకీభవించింది. దీనితో ఏప్రిల్ 15, 2019 వరకు ఈ చిత్రాన్ని సినిమా థియేటర్స్, సోషల్ మీడియా, యూట్యూబ్ తదితర మాధ్యమాలలో ప్రదర్శించకూడదని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించిన కోర్టు ఆర్డర్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.
అంతా సిద్దమైన తరుణంలో
లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్ర విడుదలని కోర్టు వాయిదా వేయడం చిత్ర యూనిట్ కు పెద్ద షాక్ అని చెప్పొచ్చు. సెన్సార్ తో పాటు విడుదలకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తయిన తరుణంలో న్యాయస్థానం విడుదల అడ్డుకుంది. అంతా అనుకున్నట్లు జరిగి ఉంటే శుక్రవారం రోజు ఈ చిత్రం విడుదల కావాల్సి ఉంది. ఏప్రిల్ 15 వరకు లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం వాయిదా పడడంపై చిత్ర యూనిట్ ఇంకా స్పందించలేదు.