Don't Miss!
- Sports సారీ బ్రదర్.. కావాలని కొట్టలేదు - పంత్ ఎమోషనల్ Video
- Finance Nestle India: అదిరిపోయే లాభాలు ప్రకటించిన నెస్లే ఇండియా..
- News రాయలసీమలో టీడీపీకి బిగ్ షాక్ .. వైసీపీలోకి కీలక నేత
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
'లక్ష్మీస్ ఎన్టీఆర్' బయ్యర్లకు మొదలైన గుబులు.. ఆర్జీవిని కలసి ఏం చెప్పారంటే!
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఆ మధ్యన విడుదలైన లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ మంచి రెస్పాన్స్ వస్తోంది. అద్భుతమైన డ్రామా, సరైన భావోద్వేగాలతో ఎన్టీఆర్, లక్ష్మీ పార్వతి మధ్య జరిగిన సంఘటనలని తాను కళ్ళకు కట్టునట్లు చూపించబోతున్నానని వర్మ తెలిపాడు. ఇటీవలే లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని మార్చి 22న విడుదల చేయనున్నట్లు వర్మ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మి పార్వతి ఎంట్రీ, ఆ తర్వాత ఆయన కుటుంబంలో, రాజకీయ జీవితంలో చోటు చేసుకున్న సంఘటనల ఆధారంగా వర్మ ఈ చిత్రాన్ని రూపొందించాడు.
సినీ ఇండస్ట్రీకి రామ్ గోపాల్ వర్మ మేనకోడలు? ఫోటోస్ షేర్ చేసిన ఆర్జీవీ!
అందరిలో ఉత్కంఠ
ఫిబ్రవరిలో బాలయ్య నటించిన ఎన్టీఆర్ బయోపిక్ లోని రెండవ భాగం ఎన్టీఆర్ మహానాయకుడు విడుదలై తీవ్రంగా నిరాశపరిచింది. ఇప్పుడు వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని విడుదల చేయనుండడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ట్రైలర్ లో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులని, ముఖ్యంగా చంద్రబాబు పాత్రని వర్మ వివాదభరితంగా చూపించాడు. సినిమాలో ఇంకెన్ని సంచలనాలు ఉన్నాయో అని అంతా చర్చించుకుంటున్నారు.
ఎన్టీఆర్ ఆశీస్సులతో
ఎన్టీఆర్ ఆశీస్సులతో లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని మార్చి 22న విడుదల చేయనున్నట్లు వర్మ ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు. వర్మ ఈ చిత్రాన్ని లక్ష్మీ పార్వతి కోణంలో తెరకెక్కించినట్లు అర్థం అవుతోంది. ఎన్టీఆర్ అభిమానులు లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. ఇక ఈ చిత్రం మార్చి 22 విడుదలపై బయ్యర్లలో గుబులు మొదలైనట్లు ప్రచారం జరుగుతోంది. డిస్ట్రిబ్యూటర్స్ అందరూ వర్మని కలసి విడుదల తేదీ మార్చమని అడిగినట్లు వార్తలు వస్తున్నాయి.
బయ్యర్లకు భయం అందుకే
లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం విడుదలకు ఒకరోజు ముందు సువర్ణ సుందరి, అల్లు శిరీష్ ఎబిసిడి, ప్రేమ కథా చిత్రం 2 లాంటి ఎం,మీడియం రేంజ్ చిత్రాలు విడుదలవుతున్నాయి. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్ర విడుదలకు ఒక వారం ముందు రాయ్ లక్ష్మి నటించిన వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి చిత్రం విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రానికి థియేటర్స్ సమస్య ఎదురయ్యే అవకాశం ఉన్నట్లు బయ్యర్లు వర్మతో చెబుతున్నారట. కేవలం ఎన్టీఆర్, లక్ష్మీ పార్వతి పేర్ల వలనే ఈ చిత్రానికి క్రేజ్ వచ్చింది. ఇందులో నటిస్తున్నవారంతా కొత్తవారే. దీనితో లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని అనుకున్న సమయానికంటే ముందుగా విడుదల చేస్తే మంచిదని బయ్యట్లు వర్మతో చెప్పినట్లు తెలుస్తోంది.
వాస్తవాలతోనే
లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంపై విమర్శలు కూడా వస్తున్నాయి. ఎన్టీఆర్ చరిత్రని వక్రీకరించి ప్రయత్నం జరుగుతోంది అనే విమర్శకు వర్మ పలు ఇంటర్వ్యూలలో సమాధానం ఇచ్చాడు. లక్ష్మి పార్వతి, ఎన్టీఆర్ మధ్య ఉన్న అనుబంధం.. ఆమె వచ్చిన తర్వాత ఎన్టీఆర్ కుటుంబంలో చోటు చేసుకున్న పరిణామాలపై అధ్యయనం చేసి వాస్తవాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు వర్మ క్లారిటీ ఇచ్చారు.