Don't Miss!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- News బాలకృష్ణకు షాక్: హిందూపురంలో నామినేషన్ వేసిన స్వామి పరిపూర్ణానంద
- Sports CSK vs LSG: శతక్కొట్టిన రుతురాజ్ గైక్వాడ్.. చితక్కొట్టిన శివమ్ దూబే!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
లతా మంగేష్కర్కు యశ్ చోప్రా పురస్కారం
ఇందులో భాగంగా ఈ సంవత్సరం ఆ అవార్డుకు లతా మంగేష్కర్ను ఎంపిక చేసారు. పురస్కారంతో పాటు రూ. 10 లక్షల నగదు, ప్రశంసా పత్రం అందజేయనున్నారు. అక్టోబర్ 19న ముంబైలో ఈ పురస్కరాన్ని ప్రదానం చేస్తామని అవార్డు కమిటీ చైర్మన్ టి. సుబ్బిరామిరెడ్డి తెలిపారు. అవార్డు కమిటీ జ్యూరీ సభ్యులుగా హేమా మాలిని, అనిల్ కపూర్, సిమి గరెవాల్ వ్యవహరిస్తున్నారు.
యశ్ చోప్రా గురించి మాట్లాడుతూ...అరవయ్యేళ్లపాటు చిత్ర పరిశ్రమలో దర్శక నిర్మాతగా కొనసాగిన వ్యక్తి యశ్ చోప్రా. అలాంటి ఓ మంచి దర్శకుడి పేరును నిత్యం స్మరించుకొనేలా ఈ అవార్డును ఏర్పాటు చేసాం. దేశం గర్వించదగ్గ గాయని, భారతరత్న లతా మగేష్కర్కు ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తుండటం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు.
యశ్ చోప్రాతో ఉన్న అనుబంధం గురించి సుబ్బిరామిరెడ్డి మాట్లాడుతూ... 'ఓ నిర్మాతగా ఆయనతో నాకు చక్కటి అనుబంధం ఉంది. విజయ్, చాందినీ, లమ్ హే తదితరల చిత్రాలను యశ్ చోప్రా దర్శకత్వంలో నిర్మించాను' అని తెలిపారు. ఆగస్టు 11న సుబ్బిరామిరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో సినీతారలతో క్రికెట్ మ్యాచ్ నిర్వహించనున్నట్లు తెలిపారు.