Don't Miss!
- Sports సారీ బ్రదర్.. కావాలని కొట్టలేదు - పంత్ ఎమోషనల్ Video
- Finance Nestle India: అదిరిపోయే లాభాలు ప్రకటించిన నెస్లే ఇండియా..
- News రాయలసీమలో టీడీపీకి బిగ్ షాక్ .. వైసీపీలోకి కీలక నేత
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
లతా మంగేష్కర్కు యశ్ చోప్రా పురస్కారం
ఇందులో భాగంగా ఈ సంవత్సరం ఆ అవార్డుకు లతా మంగేష్కర్ను ఎంపిక చేసారు. పురస్కారంతో పాటు రూ. 10 లక్షల నగదు, ప్రశంసా పత్రం అందజేయనున్నారు. అక్టోబర్ 19న ముంబైలో ఈ పురస్కరాన్ని ప్రదానం చేస్తామని అవార్డు కమిటీ చైర్మన్ టి. సుబ్బిరామిరెడ్డి తెలిపారు. అవార్డు కమిటీ జ్యూరీ సభ్యులుగా హేమా మాలిని, అనిల్ కపూర్, సిమి గరెవాల్ వ్యవహరిస్తున్నారు.
యశ్ చోప్రా గురించి మాట్లాడుతూ...అరవయ్యేళ్లపాటు చిత్ర పరిశ్రమలో దర్శక నిర్మాతగా కొనసాగిన వ్యక్తి యశ్ చోప్రా. అలాంటి ఓ మంచి దర్శకుడి పేరును నిత్యం స్మరించుకొనేలా ఈ అవార్డును ఏర్పాటు చేసాం. దేశం గర్వించదగ్గ గాయని, భారతరత్న లతా మగేష్కర్కు ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తుండటం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు.
యశ్ చోప్రాతో ఉన్న అనుబంధం గురించి సుబ్బిరామిరెడ్డి మాట్లాడుతూ... 'ఓ నిర్మాతగా ఆయనతో నాకు చక్కటి అనుబంధం ఉంది. విజయ్, చాందినీ, లమ్ హే తదితరల చిత్రాలను యశ్ చోప్రా దర్శకత్వంలో నిర్మించాను' అని తెలిపారు. ఆగస్టు 11న సుబ్బిరామిరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో సినీతారలతో క్రికెట్ మ్యాచ్ నిర్వహించనున్నట్లు తెలిపారు.