Don't Miss!
- News మేషరాశిలో శుక్రుడు.. ఈ రాశులవారికి తీవ్ర అనారోగ్యం.. జాగ్రత్త!!
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
వేలానికి దివంగత నటి ఇల్లు: రంగంలోకి ఐటీ శాఖ..
చెన్నైలోని దివంగత నటి శ్రీవిద్య ఇంటిని ఆదాయపన్ను శాఖ అధికారులు వేలం వేయనున్నారు. చాలాకాలంగా పెండింగ్ లో ఉన్న బకాయిలను క్లియర్ చేయడానికే ఈ వేలం నిర్వహిస్తున్నట్టు చెబుతున్నారు.
మార్చి 26వ తేదీన రూ.1.14కోట్ల ప్రారంభ ధరతో ఆ ఇంటిని వేలం వేయనున్నట్టు అధికారులు తెలిపారు. చెన్నైలోని అభిరామపురంలో ఉన్న ఈ ఇల్లు ప్రస్తుతం ఐటీ(ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్) ఆధీనంలోనే ఉంది. ఉమాశంకర్ అనే న్యాయవాదికి దీన్ని అద్దెకు ఇచ్చినట్టు సమాచారం. ఆ అద్దెను ఐటీ జమ చేసుకుంటోంది.
వేలంపై స్పందించిన ఉమాశంకర్.. 2005లో శ్రీవిద్య ఈ ఇంటిని తనకు అద్దెకు ఇచ్చినట్టు తెలిపారు. ప్రతీ నెల తాను ఇచ్చే రూ.13వేల అద్దెను శ్రీవిద్యకు సన్నిహితుడైన ఎమ్మెల్యే గణేశ్ కుమార్ ఐటీ శాఖకు చెల్లిస్తున్నట్టు చెప్పారు.
కాగా, శ్రీవిద్య 2006లో కేరళలో క్యాన్సర్ వ్యాధితో మరణించారు. 1996 నుంచి ఆమె చనిపోయేనాటి వరకు ఆమె ట్యాక్స్ చెల్లించలేదు. దీంతో పెండింగ్ బకాయిల మొత్తం భారీగా పెరిగిపోయింది. ఇన్నాళ్లు ఇంటి అద్దెనే బకాయి కింద వసూలు చేసుకుంటున్నప్పటికీ.. ఇలా అయితే కష్టమని భావించిన ఐటీ.. ఇప్పుడు ఏకంగా ఇంటినే వేలానికి పెట్టింది.