Don't Miss!
- News YS Jagan Stone Attack: జగన్ పై దాడి కేసు విచారణ-ఈసీ జోక్యం కోరిన టీడీపీ..!
- Sports ఆర్సీబీ తుది జట్టు అంచనా
- Finance Tata Sons IPO: టాటా సన్స్ ఐపీఓ వస్తుందా.. రాదా..!
- Technology 6.9 అంగుళాల డిస్ప్లే, 64MP కెమెరా ఫోల్డబుల్ ఫోన్పై భారీ డిస్కౌంట్.. అమెజాన్ సేల్ పూర్తి వివరాలు..!
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Automobiles హ్యుందాయ్ ఎక్స్టర్ దిమ్మ తిరిగే మైలేజ్.. ఓనర్ ఫుల్ ఖుష్.. ఫొటోలతో సహా ప్రూఫ్ ఇదిగో.!!
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
గోపీచంద్ సినిమా లేటెస్ట్ న్యూస్, ఈసారి అభిమానులకు పండగే!
యాక్షన్ హీరో గోపీచంద్ ప్రస్తుతం 'పంతం' అనే చిత్రంలో నటిస్తున్నారు. 'ఫర్ ఎ కాజ్' అనేది సబ్ టైటిల్. కెరీర్లో 25వ చిత్రం కావడంతో గోపీచంద్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా చేస్తున్నారు. కె చక్రవర్తి ఈ చిత్రం ద్వారా దర్శకుడు పరిచయం కాబోతున్నాడు. మొదటిసారి గోపీచంద్ సరసన మెహ్రీన్ హీరోయిన్ గా నటిస్తోంది.
తాజాగా ఈ సినిమాకు సంభందించిన క్లైమాక్స్ పోర్షన్ షూటింగ్ హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఇది పూర్తికాగానే మిగిలిన టాకీ పార్ట్, పాటల్ని యూకేలో చిత్రీకరించబోతున్నారు చిత్ర యూనిట్. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను జులై 5న విడుదల చెయ్యడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కెకె.రాధామోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రసాద్ మురెళ్ళ సినిమాటోగ్రఫి చేస్తుండగా మెలోడి కింగ్ గోపి సుందర్ స్వరాలు సమకురుస్తున్నారు. ఈ సినిమాతో గోపీచంద్ సక్సెస్ సాధిస్తాడని చిత్ర యూనిట్ నమ్మకంగా ఉంది. అభిమానులకు గోపీచంద్ ఈ సినిమాతో అలరించబోతున్నాడని సమాచారం.