Don't Miss!
- News కేసీఆర్ భరోసా: 22 నుంచి బస్సు యాత్రతో జనంలోకి
- Sports భార్య పేరు చెప్పి.. DK నోరు మూయించిన కోహ్లి Video
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
గోపీచంద్ సినిమా లేటెస్ట్ న్యూస్, ఈసారి అభిమానులకు పండగే!
యాక్షన్ హీరో గోపీచంద్ ప్రస్తుతం 'పంతం' అనే చిత్రంలో నటిస్తున్నారు. 'ఫర్ ఎ కాజ్' అనేది సబ్ టైటిల్. కెరీర్లో 25వ చిత్రం కావడంతో గోపీచంద్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా చేస్తున్నారు. కె చక్రవర్తి ఈ చిత్రం ద్వారా దర్శకుడు పరిచయం కాబోతున్నాడు. మొదటిసారి గోపీచంద్ సరసన మెహ్రీన్ హీరోయిన్ గా నటిస్తోంది.
తాజాగా ఈ సినిమాకు సంభందించిన క్లైమాక్స్ పోర్షన్ షూటింగ్ హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఇది పూర్తికాగానే మిగిలిన టాకీ పార్ట్, పాటల్ని యూకేలో చిత్రీకరించబోతున్నారు చిత్ర యూనిట్. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను జులై 5న విడుదల చెయ్యడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కెకె.రాధామోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రసాద్ మురెళ్ళ సినిమాటోగ్రఫి చేస్తుండగా మెలోడి కింగ్ గోపి సుందర్ స్వరాలు సమకురుస్తున్నారు. ఈ సినిమాతో గోపీచంద్ సక్సెస్ సాధిస్తాడని చిత్ర యూనిట్ నమ్మకంగా ఉంది. అభిమానులకు గోపీచంద్ ఈ సినిమాతో అలరించబోతున్నాడని సమాచారం.