Don't Miss!
- News తనపై ఉన్న కేసుల వివరాలను వెల్లడించిన సీఎం జగన్
- Sports IPL 2024: అప్పుడు కావ్య పాపను చూసి నవ్వుకున్నారు.. ఇప్పుడు ఆమె నవ్వుతోంది!
- Technology యూట్యూబ్కు పోటీగా TV యాప్.. ఫీచర్లు, అల్గారిథమ్ పైన X సీఈవో ఏమన్నారంటే.. ?
- Lifestyle టాక్సిక్ రిలేషన్షిప్లో ఉన్నారనడానికి ఇవే సంకేతాలు.. ?
- Finance Stock Market Close: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
దగ్గుబాటి వారి వెడ్డింగ్ కార్డ్స్ రెడీ.. స్పెషల్ అప్డేట్ ఇచ్చిన రానా ప్రేయసి.. వేదిక ఎక్కడంటే..?
కరోనా గోల లేకుంటే ఈపాటికి దగ్గుబాటి పెళ్లి సంబరాలు అకాశాన్ని తాకేవి. ఫ్యామిలీలో చాలా రోజుల తరువాత జరుగుతున్న శుభకార్యం కావడంతో రానా పెళ్లిని ఒక రేంజ్ లో చేయాలని సురేష్ బాబు వేసుకున్న ప్లాన్స్ కరోనా వల్ల కాస్త తారుమరయ్యాయి. ఇక చాలా రోజుల తరువాత రానా ప్రేయసి మిహికా బజాజ్ ఒక స్పెషల్ అప్డేట్ ఇచ్చారు. సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేసిన ఒక ఫోటో కూడా వైరల్ అవుతోంది.
క్లారిటీ ఇచ్చిన మిహికా..
రానా దగ్గుబాటి - మిహికా బజాజ్ పెళ్లిపై గత కొంత కాలంగా అనేక రూమర్స్ వస్తున్న విషయం తెలిసిందే. ఇక ఆగస్ట్ లో వీరి పెళ్లి జరిగే అవకాశం ఉంది. అయితే కరోనా తీవ్రత ఎక్కువ అవుతుండడం వలన పెళ్లి కార్యక్రమాలు వాయిదా పడే అవకాశం ఉన్నట్లు కూడా కథనాలు వచ్చాయి. కానీ మిహికా ఇటీవల ఒక స్పెషల్ ఫొటోలతో పనులు యదవిధిగా కొనసాగుతున్నట్లు ఒక క్లారిటీ ఇచ్చేసింది. ప్రస్తుతం పోస్ట్ చేసిన ఫోటో కూడా వైరల్ అవుతోంది.
వెడ్డింగ్ కార్డ్స్ రెడీ!
పెళ్లి రోజు ఎలా రెడీ అవ్వాలో ముందుగానే అన్ని రెడీ చేసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే అతిధులకు ఇవ్వాల్సిన స్పెషల్ వెడ్డింగ్ కార్డ్స్ కూడా సిద్దమైనట్లు మిహికా ఫొటోతో ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది. పెళ్లి తొజు వేసుకోవాల్సిన జూటిస్ షూస్ ని కూడా చూపించిన కొత్త పెళ్లి కూతురు అవి డిజైన్ చేసిన వారికి ధన్యవాదాలు తెలిపింది. మొత్తానికి మిహికా తన పెళ్లికి అద్బుతమైన ప్లాన్స్ తో రెడీ అవుతోందనే చెప్పాలి.
పెళ్లి వేదిక ఎక్కడంటే..
ఇక పెళ్లి వేదిక ఎక్కడనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ముందుగా ఎంగేజ్మెంట్ సింపుల్ గా ఫినిష్ చెసుకోవచ్చు కానీ పెళ్లిని మాత్రం వీలైనంత వరకు కాస్త గ్రాండ్ గా నిర్వహించాలని సురేష్ బాబు అనుకుంటున్నారు. అందుకోసం ఫలక్ నుమా ప్యాలెస్ ని బుక్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ఆదేశాల ప్రకారం తగిన జాగ్రత్తలను అనుసరించి పెళ్లిని హ్యాపీగా నిర్వహించాలని దగ్గుబాటి వారు ఆలోచిస్తున్నారు.
Recommended Video
పెళ్లికి ముఖ్య అతిధులు?
ఇక పెళ్లికి అతిధులు ఎవరనేది అతి ముఖ్యమైన అంశం. ఎందుకంటే సురేష్ బాబు పరిచయాలు బాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకు ఉన్నాయి. ఆయన తెలియని సినీ ప్రముఖులు ఉండరు. రాజకీయ నాయకులతో కూడా ఆయనకు మంచి సాన్నిహిత్యం ఉంది. అందుకే కరోనా సమయంలో పెళ్లికి ఎవరెవరిని పిలుస్తారు అనేది హాట్ టాపిక్ గా మారింది. వారి సన్నిహితుల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. అతి తక్కువ మంది రాబోతున్నట్లు ఒక టాక్ వస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.