Don't Miss!
- News రైతు రుణమాఫీ చేస్తే పార్టీని రద్దు చేసుకుంటావా? హరీష్ కు రేవంత్ రెడ్డి ప్రతిసవాల్
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Sports IPL 2024: హార్దిక్ పాండ్యా చెత్త కెప్టెన్సీనే ముంబై ఇండియన్స్ కొంపముంచింది: క్రీడా మంత్రి
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
వాళ్ళు ఒప్పుకుంటే వెండితెరపై SPB బయోపిక్.. మొదటిసారి క్లారిటీ ఇచ్చిన బడా వ్యాపారవేత్త
గాన గంధర్వుడు ఎస్పీ.బాలసుబ్రహ్మణ్యం మరణించి నెలలు గడుస్తున్నా ఇంకా ఆయన వదిలిన వెళ్లిన రోజును అభిమానులు మర్చిపోలేకపోతున్నారు. 2020 లో సినీ ప్రపంచంలో ఎన్నో విషాద ఛాయలు అలుముకున్న విషయం తెలిసిందే. తెలుగు వారి అభిమానులను ఒక్కసారిగా షాక్ కు గురి చేసిన ఘటన ఎస్పీ.బాలసుబ్రహ్మణ్యం మరణం. ఇక చాలా రోజుల తరువాత ఎస్పీబీ బయోపిక్ చర్చల్లోకి రావడం హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల ఒక ప్రముఖ వ్యాపారవేత్త ఆ విషయంపై స్పందించారు.
భాషతో సంబందం లేకుండా..
ఆల్ టైమ్ ఇండియన్ బెస్ట్ సింగర్స్ లిస్ట్ తీస్తే అందులో ఎస్పీ.బాలసుబ్రహ్మణ్యం నెంబర్ వన్ స్థానంలో ఉంటారని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. భాషతో సంబంధం లేకుండా సంగీత ప్రపంచంలో 45వేలకు పైగా పాటలు పాడిన బాలసుబ్రహ్మణ్యం అంటే ఒక దైవంలా చూసేవాళ్ళు కోట్లాది మంది ఉన్నారు. భౌతికంగా మన దగ్గర లేకపోయినప్పటికీ పాటతో ప్రతి రోజు పలకరిస్తూనే ఉంటారని ప్రముఖ గాయకులు గుర్తు చేసుకుంటున్నారు.
ప్రాణాలతో పోరాడుతూ..
గత ఏడాది సెప్టెంబర్ 25న బాలసుబ్రహ్మణ్యం చెన్నైలోని ప్రముఖ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచిన విషయం తెలిసిందే. కోవిడ్ పాజిటివ్ వలన హాస్పిటల్ జాయిన్ అయిన బాలసుబ్రహ్మణ్యం నెలరోజులకుపైగా ప్రాణాలతో పోరాడుతూ తుది శ్వాస విడువడం సంగీత లోకాన్ని షాక్ కు గురి చేసింది.
అంత ఈజీ కాదు
అనుకోకుండా వచ్చి సినిమా సంగీత ప్రపంచంలో అగ్ర గాయకుడిగా ఎదిగిన బాలసుబ్రహ్మణ్యం బయోపిక్ పై గత ఏడాది నుంచి కూడా అనేక రకాల కథనాలు వస్తున్నాయి. అయితే ఎస్పీబీ పాత్రకు తగ్గట్లు నటించే నటులు దొరకడం ఒక ఎత్తైతే ఆయన సింగింగ్ కు తగ్గట్లుగా పాటలు పడటం మరొక ఎత్తు. బాలసుబ్రహ్మణ్యంలా పాటలు పాడటం అంత సులువైన విషయం కాదని అందరికి తెలిసిందే.
వాళ్ళు అనుమతి ఇస్తే..
ఇటీవల హృదయాంజలి అనే మ్యూజికల్ ప్రోగ్రామ్ లో సింగర్స్ అందరూ ఎస్పీ. బాలసుబ్రహ్మణ్యంకు నివాళులర్పించారు. ఇక బాలు గారికి అత్యంత సన్నిహితులైన శుభోదయం గ్రూప్ చైర్మెన్ లక్ష్మీ ప్రసాద్ మొదటిసారి బాలసుబ్రహ్మణ్యం బయోపిక్ పై క్లారిటీ ఇచ్చారు. వారి కుటుంబ సభ్యులు అనుమతి ఇస్తే తప్పకుండా బాలసుబ్రహ్మణ్యం గారి బయోపిక్ ను వెండితెరపైకి తీసుకువస్తామని అన్నారు. మరి ఈ విషయంపై ఎస్పీబీ కుటుంబ సభ్యులు ఎలాంటి క్లారిటీ ఇస్తారో చూడాలి.