Don't Miss!
- Finance Gold Rate Today: బంగారం ప్రియులకు షాక్.. పెరిగిన ధర..!
- News దేవినేని ఉమకు కీలక బాధ్యత అప్పగించిన చంద్రబాబు..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- Sports ఖమ్మం క్లాసెన్..మెదక్ మార్క్రమ్: క్రియేటివిటీ కొట్టేవాడే లేడు భయ్యా
- Lifestyle Lok Sabha Election 2024:మరో 3 నెలల్లో పట్టాభిషేకం ఎవరికి? జ్యోతిష్యం ఏ పార్టీకి స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తోంది
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
మెగా హీరో సరసన రెండవ సారి ఛాన్స్ కొట్టేసిన హీరోయిన్!
సొట్ట బుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి ప్రస్తుతం ప్లాపుల్లో ఉంది. ఆమె నటించిన ఉన్నది ఒక్కటే జిందగీ, ఇంటెలిజెంట్ చిత్రాలు పరాజయం చెందాయి. నిరాశలో ఉన్నా లావణ్యకు తాజాగా మంచి అవకాశం దక్కింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తదుపరి చిత్రంలో లావణ్య ఛాన్స్ కొట్టేసింది. వరుణ్ తేజ్.. ఘాజి ఫేమ్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అవుతున్నాడు.
ఈ చిత్రం అంతరిక్ష పరిశోధనకు సంబంధించి థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతోంది. ఇప్పటికే ఈ చిత్రంలో బాలీవుడ్ హాట్ బ్యూటీ అతిధి రావు హైదరి హీరోయిన్ గా ఎంపికైన సంగతి తెలిసిందే. తొలి చిత్రాన్ని అండర్ వాటర్ మిషన్ గా సబ్ మెరైన్ యుద్దాన్ని సంకల్ప్ రెడ్డి ఘాజి చిత్రంలో చూపించాడు. రెండవ చిత్రం కోసం కూడా భిన్నమైన కథనే ఎంచుకున్నాడు. అంతరిక్ష పరిశోధన నేపథ్యంలో ఈ చిత్రం ఆసక్తికరంగా సాగనుంది. ఈ చిత్రం కోసం వరుణ్ తేజ్ ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటున్నా సంగతి తెలిసిందే.
ఈ చిత్రం కోసం లావణ్య త్రిపాఠిని సెకండ్ హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు కో ప్రొడ్యూసర్ సంజీవ్ రెడ్డితెలిపారు. లావణ్య ఎలాంటి పాత్రలో అయినా నటించగలదని ప్రశంసించారు. కాగా లావణ్య త్రిపాఠి ఇప్పటికే వరుణ్ తేజ్ సరసన మిస్టర్ చిత్రంలో నటించింది.