Don't Miss!
- Sports చరిత్ర సృష్టించిన KL రాహుల్.. ధోనీ రికార్డు బ్రేక్
- News ఏపీలో తీవ్ర వడగాల్పులు: అప్రమత్తంగా ఉండక తప్పదు
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
మేం మా పనులు చేసుకోవాలా? వద్దా...లక్ష్మీ ప్రసన్న మండిపాటు
ఓ వెబ్సైట్తో పొత్తు పెట్టుకుని దాదాపు 200 వెబ్సైట్ల నుంచి పైరసీని ఆపుతున్నాం. మేం మా పనులు చేసుకోవాలా? దొంగల వెనుక పడాలా? అర్థం కావట్లేదు అంటూ వాపోతోంది మంచు లక్ష్మీ ప్రసన్న. ఆమె తొలిసారి నిర్మాతగా మారి నిర్మించిన 'ఝుమ్మంది నాదం' చిత్రం పైరసీ సీడీలు లక్ష వరకు మంగళవారం విజయవాడలో లభించాయి. ఈ విషయానికి సంబంధించి లక్ష్మీప్రసన్న మీడియాతో సమావేశమయ్యామై పై విధంగా స్పందించారు. అలాగే..."ఝుమ్మంది నాదం చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తున్న తీరు బాగుంది. మంచి సినిమా చేశామని ఆనందంగా ఉంది. ఆ ఆనందాన్ని ఆస్వాదించేలోపు పైరసీ సీడీలు వచ్చాయని తెలిసి ఆందోళనగా ఉంది.
దయచేసి ఎవరూ పైరసీ సీడీలను కొనవద్దు. మా సంస్థ నిజమైన విజయాన్ని చూసి ఐదేళ్ళయింది. పైరసీని కొనకండి. అదే మాకు మీరు వంద కోట్లు ఇచ్చినట్టు" అని ఆమె అంటోంది. ఇక సీనియర్ దర్శకుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో మనోజ్, తాప్సీ జంటగా రూపొందిన చిత్రం 'ఝుమ్మంది నాదం'. శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్ పతాకంపై తొలిసారి నిర్మాతగా ఈ చిత్రాన్ని నిర్మించారు లక్ష్మీప్రసన్న. ఈ చిత్రం డివైడ్ టాక్ తెచ్చుకుంది.