Don't Miss!
- News పవన్ కళ్యాణ్ను మెచ్చుకున్న చంద్రబాబు
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
ఎన్టీఆర్ - కొరటాల కాంబోలో మరో మూవీ, అఫీషియల్ ప్రకటన!
‘జనతా గ్యారేజ్’ తర్వాత ఎన్టీఆర్-కొరటాల కాంబినేషన్లో మరో సినిమా రాబోతోంది. ఇప్పటి వరకు డిస్ట్రిబ్యూటర్ గా పలు సినిమాలను పంపినీ చేసిన మిక్కిలినేని సుధాకర్ ఈ సినిమా ద్వారా నిర్మాతగా మారబోతున్నారు.
హైదరాబాద్: 'జనతా గ్యారేజ్' తర్వాత ఎన్టీఆర్-కొరటాల కాంబినేషన్లో మరో సినిమా రాబోతోంది. ఇప్పటి వరకు డిస్ట్రిబ్యూటర్ గా పలు సినిమాలను పంపినీ చేసిన మిక్కిలినేని సుధాకర్ ఈ సినిమా ద్వారా నిర్మాతగా మారబోతున్నారు.
ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన జనతా గ్యారేజ్ అందుకున్న విజయాన్ని ఇంకా తెలుగు సినిమా పరిశ్రమ మర్చిపోలేదు. అంతలోనే ఈ సక్సెస్ఫుల్ కాంబినేషన్లో మరో సినిమా వస్తుండటంతో అభిమానుల్లో ఆనందం నెలకొంది.
ఈ ప్రాజెక్టు గురించి మిక్కలినేని సుధాకర్ మాట్లాడుతూ ఎన్నెన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలను డిస్ట్రిబ్యూట్ చేశాను. ఆ అనుభవం తో నిర్మాత గా మారుతున్నాను. నా చిన్న నాటి స్నేహితుడు కొరటాల శివ దర్శకత్వంలో నా తొలి చిత్రాన్ని నిర్మించడం మరియు ఇందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించడం ఆనందం గా ఉంది. వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన జనతా గ్యారేజ్ను ప్రేక్షకులు అంత తేలిగ్గా మర్చిపోలేరు. ఆ చిత్రాన్ని మించేలా, ఎన్టీఆర్ కెరీర్లోనే అత్యంత భారీగా, మైలురాయిలా నిలిచిపోయేలా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తాం. మిగిలిన అన్ని వివరాలను త్వరలోనే వెల్లడిస్తాం అని అన్నారు.