Don't Miss!
- News లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితకు మరో బిగ్ షాక్
- Finance Banking News: ప్రభుత్వ బ్యాంకులకు ఆ అధికారం లేదు.. బాంబే హైకోర్టు సంచలన తీర్పు..
- Automobiles వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- Sports IPL: నైట్ అంతా సిట్టింగ్ వేస్తే ఎలా గెలుస్తారు?- రైనా
- Technology అద్భుతమైన డిజైన్ తో నోకియా కొత్త ఫోన్ Nokia N90 Flip ! వివరాలు
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
‘లెజెండ్’ బైక్ వేలం, దక్కించునేది ఎవరు?
హైదరాబాద్: నందమూరి బాలకృష్ణ 'లెజెండ్' చిత్రంలో వాడిన బైకును వేలం వేయబోతున్నారు. తద్వారా వచ్చిన డబ్బును బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి విరాళంగా ఇవ్వబోతున్నారు నిర్మాతల. లెజెండ్ సినిమాలో బాలయ్య నడిపే ఈ బైకును రూ. 15 లక్షల ఖర్చుతో ప్రత్యేకంగా డిజైన్ చేయించారు.
ఈ బైకును దక్కించుకునేందుకు బాలయ్య అభిమానులు పోటీ పడబోతున్నారు. మరి ఈ బైకును అభిమానులు ఎంత మొత్తానికి దక్కించుకుంటారు అనేది చర్చనీయాంశం అయింది. త్వరలోనే వేలం ఎక్కడ నిర్వహించబోతున్నారనే విషయం వెల్లడి కానుంది. బైకును సొంతం చేసుకున్న వారు స్వయంగా బాలయ్య చేతుల మీదుగా ఈ బైకును అందుకోబోతున్నారు.
'లెజెండ్' చిత్రం ఈ నెల 28న గ్రాండ్గా విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర నిర్మాణ సంస్థలైన 14 రీల్స్ ఎంటర్టెన్మెంట్స్, వారాహి చలన చిత్రం సంస్థ సినిమాను గ్రాండ్గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సినిమా విడుదలకు ఒక రోజు ముందే భారీగా ప్రీమియర్ షోలు కూడా నిర్వహిస్తున్నారు.
గతంలో బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో 'సింహా' లాంటి సూపర్ హిట్ చిత్రం వచ్చిన నేపథ్యంలో 'లెజెండ్' చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రంలో బాలకృష్ణ ఇద్దరు హీరోయిన్లతో రొమాన్స్ చేయబోతున్నారు. రాధిక ఆప్టేతో పాటు, సోనాల్ చౌహాన్ ఇందులో బాలయ్యకు జోడీగా నటించారు. ఈ చిత్రం ద్వారా జగపతి బాబు విలన్ అవతారం ఎత్తారు. ఇప్పటి వరకు వెండి తెరపై హీరోగా రాణించిన జగపతి....ఈ చిత్రంలో భయంకరమైన విలన్ పాత్రలో దర్శనమివ్వబోతున్నారు.