Don't Miss!
- News జగన్ సంచలనం..వైఎస్ భారతికి కీలక బాధ్యతలు
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Sports SRH vs RCB: అందుకే వాషింగ్టన్ సుందర్పై వేటు వేసాం: ప్యాట్ కమిన్స్
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
సుచిత్రాసేన్ ఆరోగ్యం విషమం
గత కొద్దిరోజులుగా ఇక్కడి ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సుచిత్రాసేన్ ఇంకా వెంటిలేటర్మీద ఉన్నారు. ఆమె రక్తంలో ఆక్సిజన్ పరిమాణాలూ తగ్గాయి. గుండె, రక్తపోటు పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
సుచిత్రా సేన్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. శ్వాస నాళం ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న ఆమెను వైద్యులు ఐసీయూకి తరలించారు. 82 ఏళ్ల సుచిత్రాసేన్ కోల్కతాలో ఒంటరిగా నివసిస్తున్నారు. అనారోగ్యం వార్త తెలిసి కుమార్తె మూన్మూన్సేన్, మనవరాలు రైమా సైన్ కోల్కతా చేరుకున్నారు. క్లాసిక్ బెంగాలీ చిత్రాలుగా పేర్కొనే పలు చిత్రాల్లో సుచిత్ర నటించారు. దేవదాసు చిత్రంలో నటనకు ఉత్తమనటి ఆమె. సప్తపది అనే చిత్రానికి గాను మాస్కో ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ నటి అవార్డు లభించింది. 2005లో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును సుచిత్ర తిరస్కరించారు. కోల్కతా ప్రభుత్వం ఆమెను వంగవిభూషణ్ అవార్డుతో సత్కరించింది.
ఇక భజనసంగీతంతో ఒకానొకప్పుడు జనాన్ని సమ్మోహనం చేసిన జ్యుతికారాయ్ స్వరమాధుర్యానికి ముగ్ధులైన మహాత్మాగాంధీ, జవహరల్లాల్ నెహ్రూలు ఆమెను ఎంతగానో అభిమానించేవారు. 92 సంవత్సరాల జ్యుతికారాయ్కి 1972లో 'పద్మశ్రీ' పురస్కారం లభించింది. తీవ్రమైన వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె ఆసుపత్రిలో చేరారు.